ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల మహేష్ జన్మదినం సందర్భంగా రిలీజయిన ఈ సినిమా ఇంట్రో టీజర్ యూట్యూబ్ లో అద్భుతమైన వ్యూస్ దక్కించుకుంది. ఇప్పటికే కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైన షెడ్యూల్ ని కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్నట్లు హీరోయిన్ రష్మిక మందన్న కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెల్పింది. 

ఇక ఈ షెడ్యూల్ లో సినిమాకు ఎంతో కీలకమైన ట్రైన్ కామెడీ ఎపిసోడ్ ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇది తనకు మొదటి షెడ్యూల్ అని, అలానే ఎంతో హాయిగా ఈ సినిమాతో సాగిన షూటింగ్, తనకు ఎంతో మధురానుభూతిని ఇచ్చిందని, అలానే తదుపరి షెడ్యూల్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను అంటూ రష్మిక తన పోస్ట్ లో తెల్పడం జరిగింది. అయితే రష్మిక పెట్టిన ఆ పోస్ట్ ను, దర్శకుడు అనిల్ రావిపూడి, విపరీతమైన నవ్వును వ్యక్తం చేస్తూ ఎమోజిలతో రీట్వీట్ చేయడం జరిగింది. సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కు రిఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో బండ్ల గణేష్, శ్రీనివాస రెడ్డి, మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, రజిత, హీరోయిన్ సంగీత, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇకపోతే వరుసగా మహేష్ తో కలిసి భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ హిట్స్ సినిమాలకు సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ వరుసగా మూడవ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మహేష్ నటించిన వన్ నేనొక్కడినే, బ్రహ్మోత్సవం సినిమాలకు పని చేసిన రత్నవేలు ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: