టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాసికల్ సినిమాలు తిస్తూ కొత్త కొత్త నటీనటులు తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజాగా కొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లు సమాచారం.  ఆనంద్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శేఖర్ కమ్ముల అనతికాలంలోనే అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. శేఖర్ కమ్ముల చివరిగా దర్శకత్వం వహించిన ఫిదా సినిమా హీరోయిన్ సాయి పల్లవి తో కలిసి తాజాగా కొత్తగా మరో ప్రాజెక్టుకి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.


ఈ సినిమా నాగచైతన్య- సాయి పల్లవి తో కలిసి శేఖర్ కమ్ముల తీయనున్నట్లు ఫిలింనగర్ టాక్. అయితే ఈ సినిమాలో ఫిదా సినిమాలో తెలంగాణ పోరి గా చూపించిన శేఖర్ కమ్ముల ఈ సినిమాలో సాయి పల్లవి ని పూర్తిగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన క్లాసికల్ డాన్సర్ గా చూపించబోతున్న ట్లు ఇండస్ట్రీ టాక్. ఇక నాగచైతన్య మాత్రం పూర్తి తరహా మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. అయితే స్వతహాగా డ్యాన్స్ లో ఇరగదీసే సాయి పల్లవి కి శేఖర్ కమ్ముల ఈ పాత్ర చెప్పటంతో వెంటనే ఓకే చెప్పినట్లు తనకి పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కి కృతజ్ఞతలు కూడా తెలిపినట్లు ఈ సినిమాలో సాయి పల్లవి చేసే డాన్స్ సీన్స్ సినిమాకు హైలెట్ గా ఉంటాయి సమాచారం.


ఈ క్రమంలో సినిమాలో ఒక మాస్ క్యారెక్టర్ కలిగిన అబ్బాయి క్లాసికల్ డాన్స్ చేసే అమ్మాయి తో వ్యవహారం ఎలా ఉంటుందన్నది తన మార్క్ డైరెక్షన్లో శేఖర్ కమ్ముల ఈ సినిమాలో ప్రయోగాత్మకంగా చూపించడానికి రెడీ అయ్యారట. కొత్త తరహాలో కొత్త ఫ్లేవర్ లో శేఖర్ కమ్ముల ఈ సినిమా ప్రయోగిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఇండస్ట్రీలో కూడా ఆసక్తి నెలకొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: