సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీకి సిద్ధమయ్యారు. 2020 సంక్రాంతికి మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటుగా అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలు వచ్చినా హాలీడేస్ ఉంటాయి కాబట్టి బాగానే కలక్షన్స్ సాధిస్తాయి.


అయితే రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు వస్తే మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాకు యావరేజ్ తెచ్చుకున్న సినిమాకు కాస్త తేడా ఉంటుంది. అందుకే జనవరి 10 నుండి 14 వరకు ఒక్కొక్కరు ఒక్కో డేట్ కు సినిమా రిలీజ్ చేస్తారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 10న రిలీజ్ ఫిక్స్ చేశారు.  


అల్లు అర్జున్, త్రివిక్రం మూవీ జనవరి 14న రావొచ్చని తెలుస్తుంది. సో ఈ రెండు సినిమాలకు 4 రోజులు గ్యాప్ ఉందన్నమాట. ఇక మరోపక్క బాలకృష్ణ, రవికుమార్ కాంబో మూవీ కచ్చితంగా పొంగల్ వార్ లో దిగుతుందని తెలుస్తుంది. ఏది ఏమైతేనేం మహేష్, బన్ని ఇద్దరు మంచి అండర్ స్టాండింగ్ తో తమ సినిమాల రిలీజ్ డేట్స్ క్లాష్ అవ్వకుండా చూసుకుంటున్నారు. 


పటాస్ నుండి ఎఫ్ 2 వరకు వరుస సక్సెస్ లను అందుకున్న అనీల్ రావిపుడి మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా అంచనాలను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక త్రివిక్రం, బన్ని కాంబోలో వస్తున్న సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబోలో ఈ సినిమా వస్తుంది. కచ్చితంగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టుకుంటాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  మరి సంక్రాంతి పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: