తెలుగు పరిశ్రమలో కొత్త సినిమాలను చేస్తూ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు అడివి శేష్. ముందు హీరోగా, డైరక్టర్ గా రెండు మూడు ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. క్షణం తర్వాత అడివి శేష్ ఫేట్ మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన గూఢచారి సినిమా అడివి శేష్ సత్తా ఏంటో మరోసారి చాటింది.


ఇక ఈరోజు అడివి శేష్ ఎవరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకట్ రాంజీ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను పివిపి బ్యానర్ లో పరం వి పొట్లూరి నిర్మించారు. రిలీజ్ కు ఒకరోజు ముందే అంటే బుధవారమే ఈ సినిమా కొందరు సిని సెలబ్రిటీస్ కోసం స్పెషల్ ప్రీమియర్ వేసి చూపించారట.  


అలా ఎవరు సినిమా ప్రీమియర్ చూసిన వారిలో కమెడియన్ వెన్నెల కిశోర్ కూడా ఉన్నాడట. సినిమా చూసిన వెంటనే వెన్నెల కిశోర్ వెంటనే వచ్చి అడివి శేష్ ను కౌగిలించుకున్నాడట. సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పాడట. టీజర్, ట్రైలర్ తో మెప్పించిన ఎవరు సినిమా అదే విధంగా ప్రేక్షకుల మెప్పు పొందింది.


డిఫరెంట్ సినిమాలతో ఇప్పటికే తెలుగులో తన మార్క్ చూపిస్తున్న అడివి శేష్ రానున్న కాలంలో స్టార్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎవరు తో పాటుగా మేజర్ సినిమా చేస్తున్నాడు. ముంబై ఉగ్రదాడిలో మరణించిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటిస్తున్నాడు. తెలుగుతో పాటుగా హిందిలో కూడా రిలీజ్ చేస్తున్న ఈ సినిమా మహేష్ బాబు నిర్మిస్తుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్ తో పాటుగా గూఢచారి 2 సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు అడివి శేష్. 



మరింత సమాచారం తెలుసుకోండి: