అడివి శేష్ హీరోగా వెంకట్ రాంజీ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఎవరు. రెజినా, నవీన్ చంద్ర వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజైన ఎవరు సినిమా మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. క్షణం, గూఢచారి సినిమాల తరహాలోనే ఎవరు కూడా సూపర్ హిట్ అయ్యింది.


అడివి శేష్ కెరియర్ లో ఈ సినిమా ఫస్ట్ డే హయ్యెస్ట్ కలక్షన్స్ సాధించింది. ఇక ఈ సినిమా హిట్టైన సందర్భంగా ఆడియెన్స్ కు ఓ వీడియో రూపంలో థ్యాంక్స్ చెప్పారు. అంతేకాకుండా సినిమాలోని ట్విస్టులను లీక్ చేస్తున్న వారికి.. ముఖ్యంగా ఇంటర్వల్, క్లైమాక్స్  సీన్స్ వీడియో తీసి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం లో పెడుతున్న స్పాయిలర్స్ కు అలా చేయొద్దని రిక్వెస్ట్ చేశారు.


సినిమాను మీరు ఎంజాయ్ చేస్తున్నారు.. మీరు ఆ ట్విస్టులు రివీల్ చేయడం వల్ల సినిమాకు ఉన్న బలం తగ్గుతుందని అడివి శేష్ అన్నారు. సినిమాలో నటించిన రెజినా, నవీన్ చంద్ర కూడా ఈ విషయంపై ఆడియెన్స్ కు రిక్వెస్ట్ చేశారు. అడివి శేష్ రిక్వెస్ట్ ను ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తారని చెప్పొచ్చు. కథ, కథనాలు గ్రిప్పింగ్ గా ఉండటం వల్ల తెలుగు ఆడియెన్స్ ను ఎవరు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది.


అంతకుముందు అడివి శేష్ రెండు మూడు సొంత ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కాని క్షణం నుండి ఆడియెన్స్ అతని మీద ఫోకస్ పెట్టేలా చేసుకున్నాడు. గూఢచారి సినిమా కూడా ఆడియెన్స్ కు నచ్చడంతో సూపర్ హిట్ చేశారు. ఇక ఎవరు సినిమా టీజర్, ట్రైలర్ సర్ ప్రైజ్ చేయగా సినిమా ఆ అంచనాలను అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: