బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ చాలా సంక్లిష్టంగా మారనుంది. గత వారాలతో పోలిస్తే ఈ వారం ఎలిమినేషన్ టఫ్ గా ఉంది. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చెప్పలేకపొతున్నారు. నామినేషన్ లో ఉన్న ఏడుగురి కంటెస్టెంట్స్ కి బయట ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, రవిక్రిష్ణ, శ్రీముఖిలు సేఫ్ జోన్ లో ఉన్నట్టే తెలుస్తుంది. మిగతా ముగ్గురి మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. 


ముఖ్యంగా రాహుల్ ఎలిమినేట్ అవ్వాలనుకునే వాళ్ళు శివజ్యోతి, రోహిణిలకి ఓట్ వేస్తున్నారు. కానీ హౌస్ లో లవ్ ట్రాక్ నడుపుతున్న కారణంగా పునర్నవి అభిమానులు రాహుల్ కే ఓటు వేస్తున్నారు. వీరిద్దరు ఉంటే మరింత బాగా ఉంటుందని రాహుల్ సేఫ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రాహుల్ కి ఉన్న ఫాలోయింగ్ తో పాటు, పునర్నవి అభిమానులు కూడా కలవడంతో రాహుల్ సేఫ్ అవుతాడేమో అనిపిస్తుంది.


ఇదిలా ఉంచితే రాహుల్ ని విమర్శించే వారు కూడా ఉన్నారు. ఆ విమర్శకుల ఓట్లు రోహిణి, శివజ్యోతిలకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే శివజ్యోతి కి అభిమానులు ఉన్నప్పటికీ పర్సంటేజ్ పరంగా ఆమెకి తక్కువ ఓట్లు వచ్చాయనే తెలుస్తుంది. ఇక రోహిణికి బయట ఫాలోయింగ్ అంతగా లేనందున మరింత తక్కువగా ఓట్లు వచ్చే ప్రమాదం ఉంది. అయితే రాహుల్ ని విమర్శించే వారి ఓట్లు శివజ్యోతి, రోహిణిలకి మేలు చేస్తాయనే వాదన కూడా వినిపిస్తుంది. 


మొత్తానికి రాహుల్, రోహిణి, శివజ్యోతి లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా ఆసక్తిగా మారింది. కానీ ఈ ముగ్గురిలో రోహిణి కొంత డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని శ్రీముఖి కూడా చెప్పింది.  కాకపోతే క్రాస్ ఓటింగ్ వల్ల ఎవరు ఎలిమినేట్ అవుతారనే అంశం ఇంట్రెస్టింగ్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: