డేరింగ్, మాస్ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు పూరి జగన్నాద్.. ఈయన సినిమాలను మాస్ డైలాగులతో, ఊరమాస్ స్టెప్పులతో తెరకెక్కించడం ఆయన నైజం. గత కొద్దికాలంగా ఈయన సినిమాలకు దూరంగా ఉండి, ఈ మద్యే రామ్ పోతినేనిని హీరో పెట్టి ఇస్మార్ట్ శంకర్ను తెరకెక్కించారు. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కైవసం చేసుకుంది. ఇది హిట్ అవ్వడంతో మరో సినిమా చేయాలనీ ఈయన రెడీ అయ్యారు.


అయితే, తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో తెరకెక్కించాలని, మహేష్ కు కథ చెప్పగా అయన డేట్లు ఖాళీ లేకపోవడంతో నో చెప్పాడని వార్తలు వచ్చాయి. నిజానికి వారిద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో ఈ సినిమాను మహేష్ తో చేయాలనే ఆలోచనను పూరి విరమించుకున్నారట. 


తాజాగా పూరి విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ తో ఎలాంటి  సినిమా తీస్తే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయొచ్చు అనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. ఇకపోతే పూరి మహేష్ తో తెరకెక్కించాలనుకున్నా స్టోరీని విజయ్ కి  చెప్పాడు. అది మహేష్ కు చెప్పాలనుకున్న జనగణమన కథ స్టోరీ. అందుతున్న సమాచారాన్ని బట్టి మహేష్ తో ప్రస్తుతం సినిమా చేసే ఆలోచనలో పూరి లేనట్టే.


ఈ నేపథ్యంలో ఈ కథను కొంచం మార్పులు చేసి విజయ్ దేవరకొండతో తెరకెక్కించాలని ఆలోచనలో పూరి ఉన్నారు. మొన్న వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో పూరీతో  సినిమా చేయడానికి విజయ్ రెడీగా ఉన్నారు. మరి పూరి అంచనాలను విజయ్ చేరుకుంటాడో లేదో.. తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే .


మరింత సమాచారం తెలుసుకోండి: