నటుడు మరియు రచయిత అయిన అడివి శేష్ ప్రధాన పాత్రలో, రెజీనా, నవీన్ చంద్ర, మురళి శర్మ, పవిత్ర లోకేష్, రాజా రవీంద్ర వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నడిచిన లేటెస్ట్ మూవీ ఎవరు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా, తోలి రోజు తొలి ఆట నుండే సూపర్ డూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. అయితే అదే రోజున ఆ సినిమాతో పాటుగా శర్వానంద్ నటించిన రణరంగం మూవీ కూడా రిలీజ్ అయి మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నప్పటికీ, ఎవరు మాత్రం తిరుగులేని విధంగా ముందుకు సాగుతోంది. ఇక నేటి నుండి చాలా ప్రాంతాల్లో ఈ సినిమాకు థియేటర్లు పెంచారంటేనే సినిమాకు ఉన్న క్రేజ్ మరియు వస్తున్న కలెక్షన్స్, ఏ రేంజిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. 

సినిమాలో ముఖ్యంగా శేష్, రెజీనాల అద్భుత నటన, ప్రతి సన్నివేశం తరువాత ఏమి జరుగుతుంది అని  ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ, అలానే మరీ ముఖ్యంగా వరుసగా వచ్చే ట్విస్టులు, ఇక సినిమా క్లైమాక్స్ లో వచ్చే మరొక అద్బుతమైన ట్విస్ట్ వెరసి ఈ సినిమాను సూర్ డూపర్ హిట్ దిశగా ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎంతో బాగా రెస్పాన్స్ వస్తోందని, అందుకే నేటి నుండి చాలా చోట్ల  థియేటర్స్ కూడా పెంచామని బయ్యర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాపై తమకు కూడా ఎంతో నమ్మకం ఉందని, 

అయితే ప్రస్తుతం సినిమాకు ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్, మరియు కలెక్షన్స్ చూస్తుంటే మాకు కొంత షాకింగ్ గా ఉందని, ఏది ఏమైనప్పటికి తాము అనుకున్న దానికంటే మన ప్రేక్షకులు తమ సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ఎవరు మూవీ యూనిట్ అమితానందాన్ని వ్యక్తంచేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన అన్నిచోట్లా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా, మరికొద్దిరోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి  చేరుకుంటుందని, అయితే ఫైనల్ గా క్లోసింగ్ తరువాతనే ఎంతమేర లాభాలు సాధిస్తుంది అనేది చెప్పగలం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: