ఇండస్ట్రీలో గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకోకపోయినాదశాబ్దకాలంగా స్థిరంగానే టాలీవుడ్ లో నిలదొక్కుంది కాజల్. అడపాదడపా కోలీవుడ్లోనూ బాలీవుడ్లోనూ మెరుపులు మెరిపించినా కాజల్ ను గుర్తించేది మాత్రం టాలీవుడ్ హీరోయిన్ గానే. అయితే కాజల్ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉన్నా ఐటమ్ సాంగ్స్ కు తానేమీ అతీతం కాదని 'జనతాగ్యారేజ్' ద్వారా చెప్పేసింది.

ఇప్పుడు ఈ పక్కా లోకల్ పాప మరోసారి ఐటమ్ సాంగ్ లో చిందేయనుంది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న 'అలా వైకుంఠపురంలో' చిత్రంలో ప్రత్యేక గేయానికి కాజల్ ను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో జతకట్టాడు. కానీ ఇప్పటివరకు త్రివిక్రమ్ కాజల్ ను డైరెక్ట్ చేసింది లేదు. కాబట్టి మొదటి కాజల్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తుందన్నమాట.

ఇక 'అలా వైకుంటపురంలో' సినిమా విషయానికి వస్తే అల్లు అర్జున్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి మహేష్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' కి పోటీగా నిలవనుండి. మొన్ననే చిన్న టీజర్ ని విడుదల చేసిన చిత్ర బృందం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. తమన్ ఈ చిత్రానికి బాణీలు అందించనున్నాడు. అల్లు అరవింద్ కి చెందిన గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని బ్యానర్ల మీద ఈ చిత్రం తెరకెక్కనుంది. 

ఇప్పటికే పక్కా లోకల్ సాంగ్ తో కుర్రకారును ఊపేసిన కాజల్ మరోసారి అల్లుఅర్జున్ లాంటి గొప్ప డాన్సర్ తో స్టెప్పులేస్తే ప్రేక్షకులకు వచ్చే మజా మామూలుగా ఉండదు. క్రితం సారి కాజల్ చేత స్టెప్పులు వేయించిన శేఖర్ మాస్టర్ ఈ పాట కి కూడా కొరియోగ్రఫీ చేయనున్నాడు అని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: