నిన్న రాత్రి అత్యంత భారీ స్థాయిలో నిర్వహింపబడ్డ ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఉద్వేగంతో ఈ మూవీ నిర్మాతల మంచితనాన్ని హైలెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫిలిం ఈవెంట్ గా నిర్వహింప బడ్డ ఈ ఈవెంట్ లో తన పై అభిమానంతో ఈ మూవీ వల్ల 100 కోట్లు పోగొట్టుకున్న నిర్మాతల మంచితనం గురించి ప్రభాస్ వివరించాడు.

ఈ మూవీ నిర్మాతలు ప్రమోద్ వినయ్ వంశీలు కొంచెం జాగ్రత్తగా తీసి ఉంటే ఈ మూవీ ఖర్చు తగ్గి 100 కోట్లు మిగిలి ఉండేదని అయితే తన మిత్రులకు తన పై ఉన్న అపారమైన ప్రేమతో తమకు వచ్చే ఆ 100 కోట్ల లాభాన్ని పోగొట్టుకున్నారు అంటూ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు అలాంటి మిత్రులు తన అభిమానులకు కూడ ఉండాలి అంటూ ప్రభాస్ ఆకాంక్షించాడు.

ఈ మూవీ దర్శకుడు సుజిత్ గురించి మాట్లాడుతూ అతడికి తన అభిమానులు తన సినిమాల నుంచి ఏమి కోరుకుంటారో అతడికి తెలుసు అని అంటూ మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ సుజిత్ అంటూ ప్రశంసలు కురిపించాడు. సుజిత్ ఈ సినిమాను తనకు చెప్పడానికి నాలుగు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు నిక్కరు వేసుకు వచ్చాడని అప్పుడు అతడి వయస్సు 24 సంవత్సరాలు మాత్రమే అని అంటూ సుజిత్ తనకు కథ చెప్పే విషయంలో అతడి కళ్ళల్లో కనిపించిన ధైర్యం ‘సాహో’ మూవీని ఈ స్థాయికి తీసుకు వచ్చింది అంటూ కామెంట్స్ చేసాడు.

ఈ సినిమాలో హీరోయిన్ శ్రద్దా కపూర్ గురించి మాట్లాడుతూ ఈ మూవీ గురించి ఒక బాలీవుడ్ హీరోయిన్ ఒక్కరోజు కూడ ఎటువంటి సమస్యా లేకుండా 2 సంవత్సరాలు తమను నమ్మి పనిచేయడం ఇందాస్త్రీలోని మరి ఏ టాప్ హీరోయిన్ చేయదు అంటూ ప్రశంసలు కురిపించాడు. తన అభిమానుల గురించి ప్రభాస్ మాట్లాడుతూ ఇక నుంచి తన పద్ధతి మార్చుకుని సంవత్సరానికి రెండు సినిమాలు చేసి తన అభిమానులను ఎంటర్ టైన్ చేస్తాను అంటూ తన అభిమానులకు జోష్ ను ఇచ్చాడు. దీనితో ‘సాహో’ నేర్పిన పాఠాలతో ప్రభాస్ ఇక భవిష్యత్ లో అత్యంత భారీ సినిమాలకు దూరంగా ఉంటాడా అన్న అభిప్రాయం అభిమానులలో కలిగింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: