అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఎవరు' బాక్సాఫీస్ వద్ద జోరుగా వసూళ్లను రాబడుతుంది. మొదటి రోజు నెమ్మదిగా ప్రారంభమైన వసూళ్లు మౌత్ టాక్ బాగుండడంతో పుంజుకున్నాయి. నాలుగు రోజుల్లో ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల షేర్ ను రాబట్టి ప్రీ రిలీజ్ బిజినెస్ లో 70 శాతం వరకు రికవరీ చేసింది. ఈ వారం తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయడం ఖాయం.
కాగా ముఖ్యంగాఈ చిత్రం ఓవర్సీస్ లో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే అక్కడ బ్రేక్ ఈవెన్ కాగా ఫుల్ రన్ లో హాఫ్ మిలియన్ మార్క్ దిశగా పయనిస్తోంది. పీవీపీ నిర్మాణంలో థ్రిల్లర్ నేపథ్యం లో నూతన దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రంతో సోలో హీరోగా అడివి శేష్ హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఆయన నటించిన క్షణం , గూఢచారి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
ఇక ఎవరు తోపాటు శర్వానంద్ నటించిన 'రణరంగం' కూడా ఒకే సారి విడుదలకాగా ప్లాప్ టాక్ తో ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద నెమ్మదించింది. మొదటి రోజు రణరంగం నాలుగు కోట్ల షేర్ ను రాబట్టి అదుర్స్ అనిపించగా తరువాత 3రోజుల్లో కేవలం 3కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టడంతో ఈ సినిమా డిజాస్టర్ జాబితాలో చేరనుంది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రం పూర్తిగా తేలిపోయింది. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో కాజల్ , కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటించగా సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మించింది.