బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 హోస్ట్ గా నాగార్జున నాల్గవ వారానికి అంతా సెట్ రైట్ అయినట్టే కనిపిస్తున్నారు. అయితే జరుగబోయే విషయాల పట్ల చిన్న క్లూ ఇస్తూ నాగార్జున హోస్ట్ ప్రతిభ మెచ్చుకునేలా ఉంది. హేమ, జాఫర్, తమన్నాల ఎలిమినేషన్ తర్వాత లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టంట్ రోహిణి. అయితే ఆమెతో మాట్లాడుతూ మళ్లీ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేందుకు సిద్ధమా అన్నాడు నాగార్జున.


అందుకు తాను ఎప్పుడు రెడీ అన్నది రోహిణి. అసలైతే ఈ వారం రోహిణి నామినేషన్ లో ఉండాల్సింది కాదు. కంటెస్టంట్స్ ఇద్దరు జంటగా కన్ఫెషన్ రూం లోకి వెళ్లి వారిలో ఒకరు నామినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నామినేషన్ లో శివ జ్యోతి, రోహిణి జంటగా వెళ్లి శివ జ్యోతిని నామినేట్ చేశారు.


కాని నామినేషన్ ప్రక్రియ గురించి ప్రస్థావించడం వల్ల రోహిణిని కూడా నామినేట్ చేశాడు బిగ్ బాస్. అలా బిగ్ బాస్ డైరెక్ట్ నామినేషన్ వల్ల రోహిణి ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే నాగార్జున రోహిణిని మళ్లీ ఈంట్లోకి వెళ్లే ఛాన్స్ వస్తే వెళ్తావా అన్నాడంటే కచ్చితంగా నెక్స్ట్ వీక్ అలా రోహిణిని మళ్లీ హౌజ్ లోకి పంపించే ప్లాన్ ఉందని అనుకోవచ్చు.


లాస్ట్ సీజన్ లో యాంకర్ శ్యామలా, నూతన్ నాయుడులను బిగ్ బాస్ హౌజ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అలానే రోహిణికి మళ్లీ ఛాన్స్ ఇస్తారేమో అని ఆడియెన్స్ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మరో లాజిక్ ఏంటంటే రోహిణి ఇంట్లో ఉన్నా అన్ని టాస్కులలో పార్టిసిపేట్ చేయట్లేదు.. అందుకే ఆమె నామినేషన్ లో ఉన్నా ఆమెకు ఓట్లు రాలేదని అంటున్నారు. మరి ఊహించింది జరిగితే అది బిగ్ బాస్ ఎలా అవుతుంది. ఇంతకీ బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాలి.     



మరింత సమాచారం తెలుసుకోండి: