తెలుగు లో కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికీ నాలుగు వారాలు పూర్తయి ఐదో వారంలోకి అడుగు పెట్టింది. ఇంటి సభ్యుల్లో మొదట నటి హేమ ఎలిమినేషన్ అయ్యింది.  తర్వాత జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ అయ్యారు.  ఇక మూడో రౌండ్ లో నటి హేమ ఎలిమినేట్ అయిన వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయ్యింది.  తమన్నా మొదట ఇంటిలోకి చాలా కూల్ గా వెళ్లినప్పటి మరుసటి రోజు నుంచి తన విశ్వరూపం చూపించి ఇంటి సభ్యులకు చికాకు తెప్పించింది. అంతే కాదు తమన్నా మాటలు కూడా వెకటం తెప్పించేలా ఉన్నాయి.

మొత్తానికి మూడో వారం తమన్నా ఎలిమినేట్ కాగా నిన్న టివి నటి రోహిణి ఎలిమినేష్ అయ్యింది.  వాస్తవానికి రోహని ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ లో లేనప్పటికీ..ఆమె చేసిన పొరపాటు వల్ల ఈ వారం నేరుగా ఎలిమినేట్ అయ్యింది. ఇక టాస్క్‌లు, నామినేషన్స్‌ అంటూ హౌస్‌మేట్స్‌ మధ్య బిగ్‌బాస్‌.. చిచ్చులు పెడుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ ఉంటాడు. సాధారణంగా  ప్రతీ ఇంట్లో ఉండే అలకలు, అరుపులు, గొడవలు, ప్రేమలు అన్నీ బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా ఉన్నాయి. తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో సరికొత్త వివాదాలకు తెరలేపారు.

  ఎవరి సేఫ్ గేమ్ వారు ఆడుకుంటూ ఉన్నారు. నిన్న నాగార్జున మీ ముఖాలపై మాస్క్ తొలగించి ఇప్పటి నుంచైనా జన్యూన్ గా ఆడాలని సూచించారు. ఐదో వారానికి గానూ  ఇంటి నుంచి పంపించేందుకు చేపట్టే నామినేషన్‌ ప్రక్రియకు సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వారంలో పునర్నవి.. రాహుల్‌ను నామినేట్‌ చేసినట్టు కనపడుతోంది. గత వారం చూపించిన తీరును బట్టి పునర్నవి, రాహూల్ మంద్య స్నేహం చిగురించి ఎక్కడికో వెళ్లిందనుకున్నారు. తీరా ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ లో దానికి విరుద్దంగా కనిపిచింది.  రాహుల్‌ తనకు క్లోజ్‌ ఫ్రెండ్‌ అని చెప్పుకునే పునర్నవి.. అతన్ని నామినేట్‌ చేసిందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  అసలు బిగ్ బాస్ లో ఏం జరగబోతుందని ఉత్కంఠంగా ఉన్నారు ఆడియన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: