యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ-ప్రమోద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సాహో. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్నారు. దాదాపు 350 కోట్ల తో రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అగ్ర దర్శకులతో పాటు స్టార్ హీరోలందరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు బోలెడన్ని తుపాకులు వాడడం కామన్. కానీ సాహో సినిమాలో మాత్రం సహజత్వం కోసం నిజమైన గన్స్ వాడారు. ఈ విషయాన్ని హీరోయిన్ శ్రద్ధాకపూర్ స్వయంగా బయటపెట్టింది. తన జీవితంలో ఫస్ట్ టైమ్ నిజమైన తుపాకీ పట్టుకుందట శ్రద్ధ కపూర్. 

"సాహో షూటింగ్ లో భాగంగా మేం కొన్ని ఒరిజినల్ తుపాకులు వాడాం. నేచురాలిటీ కోసమే అలా చేశాం. కాకపోతే అందులో బుల్లెట్స్ ఉండేవికావు. అలా ఫస్ట్ టైమ్ నేను ఓ రియల్ తుపాకీ పట్టుకున్నాను. చూడ్డానికి చిన్నగా అనిపించినప్పటికీ ఒరిజినల్ గన్ చాలా బరువుంది. అంతేకాదు చాలా సౌండ్ కూడా వస్తుంది. ఫస్ట్ టైమ్ డమ్మీ బుల్లెట్స్ తో గన్ కాల్చినప్పుడు ఆ శబ్దానికి నా చెవులు చాలాసేపు పనిచేయలేదు. ఆ తర్వాత ఇయర్-బడ్స్ పెట్టుకొని షూట్ చేశాం." అంటు ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది.

సాహో కోసం మొదట్లో ఆ తుపాకీ సౌండ్ కు వెన్నులో వణుకు వచ్చేదని, తర్వాత అలవాటైపోయిందని చెప్పింది. సినిమా కోసం రెండేళ్లు పనిచేయడంతో.. యాక్షన్ సీన్ అనగానే ముందుగా గన్ తీసుకుని సరదాగా దానితో ప్రాక్టీస్ చేసేదాన్నని అంటోంది శ్రద్ధాకపూర్. సాహో తర్వాత కూడా సౌత్ లో సినిమాలు వస్తే నటించాలనుకున్నట్లు స్పష్టంచేసింది శ్రద్ధాకపూర్. హిందీ సినిమాలు చేస్తూనే, తెలుగు-తమిళ భాషల్లో నటిస్తానని ప్రకటించింది. ఈనెల 30న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వస్తున్న సాహో ఎలాంటి రికార్డ్స్ క్రియోట్ చేస్తుందోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: