సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతరువాత టాలీవుడ్లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. యూత్ ను బాగా ఎట్ట్రాక్ట్ చేయడంతో.. సందీప్ రెడ్డికి అనేక ఆఫర్లు వచ్చాయి. అందులో ఒకటి మహేష్ సినిమా. మహేష్ కోసం కథను రెడీ చేసి నెరేట్ చేశాడు. కథ నచ్చడంతో.. స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారు. మహేష్ మహర్షి సినిమా బిజీలో ఉండగా.. సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కబీర్ సింగ్ చేసేందుకు సిద్ధం అయ్యాడు. కబీర్ సింగ్ మూవీ నిర్మాణంలో ఉండగా మహర్షి రిలీజ్ అయ్యింది.
సందీప్ బాలీవుడ్ సినిమాలో బిజీ కావడంతో మహేష్ తో నెక్స్ట్ సినిమా చేసేందుకు అవకాశం లేకపోయింది. దీంతో మహేష్ అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. అటు బాలీవుడ్ లో కబీర్ సింగ్ భారీ హిట్టైంది. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా హిట్ తరువాత మేహేష్ తో సినిమా చేయాలి అనుకుంటే.. ఇప్పుడు మహేష్ సరిలేరు నీకెవ్వరూ బిజీలో ఉన్నారు.
ఈ సమయంలో మహేష్ తో సినిమా చేయడం కష్టం. సరిలేరు నీకెవ్వరూ తరువాత ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు సిద్ధంగా ఉన్నారు. అటు గీతగోవిందం దర్శకుడు మహేష్ కోసం విపరీతంగా ట్రై చేస్తున్నారు. లైన్ చెప్పడంతో బాగుందని మహేష్ చెప్పినట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నాడు. స్క్రిప్ట్ కు మహేష్ ఒకే చెప్తే.. నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు.
అయితే, మహేష్ బాబు ఒకే చెప్తాడా లేదా అన్నది తెలియాలి. ఒకవేళ సందీప్ తో సినిమా చేయాలి అనుకుంటే.. సందీప్ వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు సందీప్ వెయిట్ చేస్తాడా అన్నది తెలియాలి. మరోవైపు సందీప్ రెడ్డి తో సినిమా చేయడానికి బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ రెడీగా ఉన్నారు. టి సిరీస్ సంస్థకూడా సందీప్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యింది. సందీప్ కథను సిద్ధం చేసుకుంటే.. బాలీవుడ్లో ఈలోపు సినిమా చెయ్యొచ్చు. మరి బాలీవుడ్లో మరో సినిమా చేయడానికి సందీప్ సిద్ధంగా ఉన్నాడా లేదా అన్నది తెలియాలి.