ఇండియన్ సినిమా లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘సాహో’ ఒకటి. బాహుబలి వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ప్రభాస్ సన్నిహితులు అయిన వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు.
ప్రభాస్ సరసన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధాకపూర్ రొమాన్స్ చేసింది. మరో 9 రోజుల్లో థియేటర్లలోకి వస్తోన్న ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. సాహో సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ను పొందింది. వివరాల ప్రకారం 2గంటల 54 నిమిషాలు రన్ టైమ్తో సినిమా లాక్ అయ్యిందని టాక్. అంటే మూడు గంటలకు 6 నిమిషాలు తక్కువ.
మొత్తం 174 నిమిషాలతో సాహో థియేటర్లలో ప్రదర్శితం కానుంది. సినిమా రన్ టైం ఎక్కువన్న కంప్లెంట్లు ఉన్నా.. సినిమా కంటెంట్పై ఉన్న నమ్మకంతో చిత్ర నిర్మాతలు, దర్శకుడు సుజీత్ రన్ టైంను కాస్త ఎక్కువగానే లాక్ చేయించినట్టు తెలుస్తోంది. ఈ రన్ టైంలో మూడు నిమిషాల పాటు ప్రకటనలు కూడా ఉండొచ్చంటున్నారు.
ఇక సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు మెచ్చుకున్నట్టు తెలుస్తోంది. సినిమా కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్గాను, అదిరిపోయే విజువల్స్తోనూ ఉందని ప్రశంసలు కురిపించారట. ఓవరాల్గా సినిమా చూశాక మైండ్ బ్లోయింగ్ అనేలా ఉందంటున్నారు.
సాహోలో జాకీష్రాఫ్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండే, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేశారు. సెన్సార్ పూర్తి కావడంతో సినిమా ఆగస్ట్ 30న సినిమా రావడం ఖరారైంది.