బాహుబలిలో ప్రతినాయకుడి పాత్రలో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి ఇప్పుడు మరోసారి విలన్ గా నటించడానికి రెడీ అవుతున్నాడు అయితే ఈ సారి తెలుగు సినిమాలో కాదు.. బాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ హౌస్ ఫుల్ కు సీక్వెల్ గా తెరకెక్కనున్న చిత్రం హౌస్ ఫుల్ 4. స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించనున్న ఈ చిత్రంలో రానా విలన్ గా కనిపించనున్నాడు. వీరితోపాటు రితేష్ దేశ్ ముఖ్ , బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారట. రైటర్ ఫర్హాద్ సంజి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించనుంది. కాగా రానా కు బాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా కాదు ఇంతకుముందు ఆయన బేబీ , దమ్ మారో దమ్ , డిపార్ట్మెంట్ చిత్రాల్లో నటించాడు.
ఇక రానా తెలుగులో నేను రాజు నేనే మంత్రి తరువాత విరాటపర్వం అనే సినిమాకు సైన్ చేశాడు. 'నీది నాది ఒకే కథ' అనే చిత్రాన్ని తెరకెకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న యంగ్ డైరెక్టర్ వేణు ఊడుగుల ఈచిత్రాన్ని తెరకెక్కిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం సాయి పల్లవి ఫై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే రానా అనారోగ్య కారణాలతో షూటింగ్ లో పాల్గొనలేకపోతున్నాడు. వచ్చే నెలలో రానా ఈసినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఎల్ వి సినిమాస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.