సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఖాళీగా ఏమాత్రం వుండలేరు. ఎప్పుడు ఏవరినో ఒకరిని, ముఖ్యంగా జనాలను కెలక్కుండా అసలు వుండలేరు. ఒక పక్క మెగాస్టార్ బర్త్ డే అంటూ మెగాభిమానులు అంతా సంబరాలు చేసుకుంటూ ఊగిపోతూ వుంటే, ఆర్జీవీ తన పంథాలో ఒక సంచలనమైన ట్వీట్ చేసాడు. అంతటితో ఊరుకోకుండా తను తీస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ వుందంటూ ఆసక్తికరమైన ఒక ట్వీట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ కి అసలు కుదురుండదు అనటానికి ఇదొక పెద్ద ఉదాహరణ. కాకపోతే ఇలాంటి ఉదాహరణలు మనం ఇంతకుముందు కొన్ని కుప్పలు చూసేశాం.

ఇది చాలదా ఇక ట్విట్టర్ లో అర్జీవీ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్, పవన్ యాంటీ ఫ్యాన్స్ తిట్టేసుకోవడానికి...కొట్టేసుకోవడానికి. అదే జరుగుతోంది ఇప్పుడు ట్విట్టర్ లో. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ, అమరావతి లో జగన్ ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని ఇండైరెక్ట్ గా చెబుతూ సినిమా తీయబోతున్నాడు ఆర్జీవీ. దీనికి సంబంధించి రీసెంట్‌గా ఒక సాంగ్ కూడా విడుదల చేశారు.  దీనికి ముందు తీసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఎంతో కొంత క్రేజ్ మధ్య విడుదలైనప్పటికి మిశ్రమ స్పందన వచ్చింది. కాకాపోతే బాలకృష్ణ తీసిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు కంటే ఎంతో బెటరనే ఫీలింగ్ ని మాత్రం ప్రేక్షకుల్లో కలగజేశాడు.

ఏదో ఒక పాయింట్ తో చిన్న కథ అల్లేసి, కాసిన్ని సంచలమైన సీన్లు జోడించేసి, సినిమా తయారు చేసి వదిలేయడం ఆర్జీవీ స్టయిల్. అది ఆడినా ఆడకపోయినా తనకు అనవసరం. పైగా మిమ్మలిని నేను నా సినిమా చూడమని బ్రతిమాలానా అంటు రివర్స్ లో అంటాడు. అందుకే జనం సినిమా విడుదలకు ముందు ఎక్కువ, విడదలయ్యాక తక్కువ మాట్లాడుకోవడం కూడా కామన్ అయిపోయింది. ఒకప్పుడు వర్మ సినిమా తీస్తున్నాడంటే, తన సినిమా థియోటర్స్ లోకి వస్తుందంటే అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు పట్టించుకోవడమే మానేశారు. అయినా తను మాత్రం ఏదో ఒక ఇష్యూ మీద ఒక పాయింట్ అనేసుకొని సినిమా తీసేస్తాడు. ఈ సినిమా తర్వాత శశికళ కూడా తీయబోతున్నాడు వర్మ.


మరింత సమాచారం తెలుసుకోండి: