నాలుగు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి కొత్త కొత్త టాస్కులు ఉండటంతో షోపై ప్రేక్షకులు బాగా అసక్తి చూపిస్తున్నారు.నిన్నటి ఎపిసోడ్లో రాహుల్ సిప్లిగంజ్, మహేశ్ విట్టాను బిగ్ బాస్ జైలు నుండి విడుదల చేయమని ఆదేశిస్తాడు. మహేశ్ శివజ్యోతితో నేను ఇంట్లో క్లోజ్ గా ఉండే హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి వెళ్ళిపోయారని చెబుతాడు. ప్రస్తుతం బాబా భాస్కర్ తో మాత్రమే క్లోజ్ గా ఉన్నానని చెబుతాడు. 
 
రాహుల్ సిప్లిగంజ్ కు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. బిగ్ బాస్ పునర్నవిని కన్ఫెషన్ రూమ్ కు పిలిచి వితిక వీడియో చూపిస్తాడు. పునర్నవి కన్ఫెషన్ రూమ్ నుండి బయటకు వచ్చాక తన గురించి ఎవరో మాట్లాడిన రెండు వీడియోలు ప్లే చేసారని చెబుతుంది. పునర్నవి బాధ పడుతూ ఉంటే వితిక నవ్వుతూ ఉంటుంది. వితిక, రాహుల్, వరుణ్ పునర్నవికి ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చారని అనుకుంటారు. 
 
శ్రీముఖిని బిగ్ బాస్ పిలిచి పునర్నవి, రాహుల్, వితిక శ్రీముఖి గురించి మాట్లాడిన వీడియోలు చూపిస్తాడు. శ్రీముఖి బయటకు వచ్చి లోపల వీడియోలు చూపించారని చెబుతుంది. వితిక నువ్వు బ్యాడ్ అవుతున్నావని పునర్నవి చెబుతుంది. బిగ్ బాస్ షో నుండి బయటకు వెళ్ళాక నీలో బ్యాడ్ గురించి చెబుతానని పునర్నవి వితికకు చెబుతుంది. 
 
అలీ రేజాను బిగ్ బాస్ పిలిచి హిమజ, శ్రీముఖి, బాబా భాస్కర్ వీడియోలు చూపిస్తాడు. అలీ రేజా బయటకు వచ్చి బాబా భాస్కర్ తో మాట్లాడతాడు. అలీ బాబా భాస్కర్ కు సారీ చెబుతాడు. హిమజకు బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులందరికీ విలన్ గా మారాలని హిమజకు చెబుతాడు బిగ్ బాస్. టాస్క్ లో భాగంగా హిమజ అలీతో గొడవ పడుతుంది. హిమజ ప్లేట్ విసిరికొట్టి గట్టిగా అరుస్తుంది. గుడ్లు అన్నీ పగలగొట్టటంతో ఇంట్లోని సభ్యులంతా హిమజ ఏంటి ఇలా ప్రవర్తిస్తుందని ఆశ్చర్యపోతారు. చివరకు హిమజ సీక్రెట్ టాస్కులో ఓడిపోయిందని బిగ్ బాస్ చెబుతాడు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: