"సాహో" సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో ప్రభాస్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. బాహుబలి ప్రమోషన్లలో ఎక్కువ పాలుపంచుకోకుండా రాజమౌళి మీద వదిలేసిన ప్రభాస్ "సాహో"సినిమా ప్రమోషన్స్ ని తన భుజాల మేదే వేసుకున్నాడు. బాలీవుడ్ లో  ఎక్కడ చూసినా ప్రభాసే కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు అందరిలో మాట్లాడాలంటే సిగ్గుగా ఫీలయ్యే ప్రభాస్ అవన్నీ పక్కకి నెట్టి ముందుకు వస్తున్నాడు.


ట్రైలర్ రిలీజ్ అయ్యాక మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేసున్నాం అని చెప్పటి నుండి ఆగకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ప్రమొషన్లలో జోరు పెంచారో అప్పటి నుండి సినిమా మీద అంచనాలు కూడా పెరిగిపోయాయి. తన స్నేహితులతో కలిసి నిర్మించిన సినిమా కాబట్టి ప్రభాస్ మరింత జాగ్రత్త పడుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఎక్కడ చూసినా "సాహో" మానియానే కనిపిస్తుంది.


ప్రభాస్ నుండి రెండేళ్ల తరువాత వస్తున్న చిత్రం కావడంతో పాటు, భారీ తనంతో తెరకెక్కిన చిత్రం కావడంతో అటు ప్రభాస్ అభిమానులు, ఇటు సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా నిన్న ప్రభాస్ బెంగుళూరులో పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగే పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు పంచుకున్నారు.


ఐతే ఒక విలేకరి మహాభారతం చేయాల్సి వస్తే అందులో ఏ పాత్ర చేయడానికి ఇష్టపడతారు అని అడుగగా, ప్రభాస్ అందులో ఎటువంటి పాత్రైనా చేయడానికి ఇష్టపడతానన్న ఆయన, ముఖ్యంగా అర్జునుడు పాత్ర చేస్తాను అంటూ మనసులో మాట బయటపెట్టారు.ఇక ఆయన తరువాత చేయబోయే చిత్రం ఓ లవ్ స్టోరీ అని, ఆ చిత్రానికి సంబందించి ఓ 20రోజుల చిత్రీకరణ కూడా జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రభాస్ ఇకపై ఏడాదికి రెండు చిత్రాలు టార్గెట్ గా పెట్టుకున్నారట. సాహో ఆగస్టు 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: