మెగా హీరో వరుణ్ తేజ్ విలన్ గా చేస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్ తండా రీమేక్ గా వస్తున్న వాల్మీకి సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు హరీష్ శంకర్. మెగా హీరోలకు హిట్లు ఇస్తున్న ఈ దర్శకుడు వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాతో మరో హిట్ పక్కా అంటున్నాడు. వాల్మీకి సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ ఫిక్స్ చేశారు.


ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ లో తన ఫ్యాన్స్ తో చాట్ చేశాడు. ఇక ఈ చాటింగ్ లో భాగంగా అందరు హీరోల ఫ్యాన్స్ తమ హీరోతో సినిమా ఎప్పుడంటూ హరీష్ శంకర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఎప్పుడంటూ మెగా ఫ్యాన్స్ కోరగా కథ చెప్పాలని ఉందని అన్నాడు.


ఇక మహేష్ తో సినిమా చేస్తారా అని ఓ సూపర్ స్టార్ అభిమాని అడిగితే మహేష్ తో పోకిరి లాంటి సినిమా తీస్తానని అన్నాడు. జిగుర్తండా రీమేక్ ను యాజిటీజ్ దించేశారా లేక ఏదైనా మార్చారా అంటే అది సస్పెన్స్ సినిమా చూసి చెప్పండని ఊరిస్తున్నాడు హరీష్ శంకర్. ఈ సినిమాకు వాల్మీకి అనే టైటిల్ ఎందుకు పెట్టారని అడిగిన అభిమాని ప్రశ్నకు సమాధానంగా మనిషి మహర్షిగా మారాడు కాబట్టే ఆయన మీద గౌరవంతో వాల్మీకి టైటిల్ పెట్టామని అన్నాడు.  


అంటే ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర కూడా చివర్లో మారుతుందని చెప్పొచ్చు. సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దె నటిస్తుంది. హరీష్ శంకర్ ఆమధ్య దాగుడుమూతలు అంటూ ఓ మల్టీస్టారర్ సినిమా అనుకున్నాడు. కాని ఆ సినిమాకు నిర్మాతలెవరు ముందుకు రాకపోవడంతో ఆ సినిమా అటకెక్కించాడు హరీష్ శంకర్. డిజే తర్వాత చాలా గ్యాప్ తర్వాత హరీష్ శంకర్ చేస్తున్న సినిమా వాల్మీకి ఈ సినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: