గత  ఏడాది  యంగ్ టైగర్ ఎన్టీఆర్  నటించిన  అరవింద సమేత సినిమా లో హీరోయిన్ చెల్లెలి పాత్రలో కనిపించింది తెలుగు బ్యూటీ  ఈషా రెబ్బ.  అయితే పెద్దగా గుర్తింపు లేని పాత్ర కావడంతో  ఈచిత్రం ఆమె కు  బ్రేక్ ఇవ్వలేదు.  ఇక ఈ సినిమా తరువాత  ఈషా ప్రస్తుతం  తెలుగులో డమరకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో 'రాగల 24 గంటల్లో' అనే హారర్ థ్రిల్లర్ లో నటిస్తుంది.  ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది ఈషా.  ఇక ఈ సినిమా తోపాటు  కోలీవుడ్ లో జి వి ప్రకాష్ కుమార్ హీరోగా  ప్రముఖ దర్శకుడు ఏజిల్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చిత్రంలో  ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుంది.  ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా  జరుగుతుంది.  ఈ చిత్రానికి 'ఆయిరం జన్మంగల్' అనే టైటిల్  ఖరారు చేశారు. యువ హీరో  విష్ణు విశాల్ ఈ టైటిల్ ను రివీల్ చేశారు. 






హారర్ కామెడీ  నేపథ్యం లో  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  ఎన్నారై గర్ల్ నిఖిషా పటేల్ , ప్రముఖ కమెడియన్ సతీష్  ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా  జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.  అభిషేక్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.   కాగా  ఈషా రెబ్బ కు  తమిళంలో  ఇది రెండో సినిమా. ఇంతకుముందు ఆమె 'ఓయ్' అనే చిత్రం తో  కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2016 లో విడుదలైన ఆ చిత్రం  పరాజయం  చెందడంతో  ఈషా కు  ఆఫర్లు రాలేదు.  ఆ తరువాత  తెలుగులో  కొన్ని చిత్రాల్లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది కానీ బిజీ కాలేకపోయింది. దాంతో మళ్ళీ కోలీవుడ్ లో  సినిమా ఆఫర్ రావడంతో  వెంటనే  ఓకే చెప్పేసింది.   ఇక  తెలుగులో ఆఫర్లను  రాబట్టుకోలేకపోతున్న ఈషా రెబ్బ ఈ  ఆయిరం జన్మంగల్  తో  హిట్ కొట్టి  కోలీవుడ్ లోనైనా  బిజీ అవుతుందో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: