ప్రభాస్.. ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరో. వరసగా భారీ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి వంటి సూపర్ హిట్ సీరీస్ లో నటించిన ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. సినిమా రిలీజ్ దగ్గరకు వస్తున్న సందర్భంగా యూనిట్ భారీ ప్రమోషన్ చేస్తున్నది. ఈ ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ తో టాప్ రియాలిటీ షోలలో ప్రభాస్ టీం సందడి చేసింది.
బాలీవుడ్ లో టాప్ షోలలో ఒకటిగా ఉన్న నచ్ బలియే రియాలిటీ ప్రోగ్రాం లో ప్రభాస్ సందడి చేశారు. ఈ షోను బాలీవుడ్ అలనాటి హీరోయిన్ రవీనాటాండన్ కండక్ట్ చేస్తోంది. ఈ షోలో సందడి చేసిన ప్రభాస్ ఆమెతో కలిసి స్టెప్స్ వేశారు. టిప్ టిప్ బర్సా పానీ సాంగ్ కు డ్యాన్స్ చేశారు. రవీనా గురించి ప్రభాస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రవీనా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం విశేషం. ప్రభాస్ చెప్పిన ఈ మాటలకూ అంతా షాక్ అయ్యారు. రవీనా ప్రభాస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి అని వాపోయారు. రవీనా అంటే ప్రభాస్ కు ఇష్టం అయ్యి ఉండొచ్చు. బహుశా అందుకే ఆమె గురించి అలా మాట్లాడి ఉంటారు. అంతేకాదు, ఈ షో జరిగినంతసేపు ప్రభాస్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఎప్పుడు ప్రభాస్ ను అంతా యాక్టివ్ గా చూడలేదు అని సోషల్ మీడియాలో చాలామంది పేర్కొంటున్నారు.
రవీనాతో కలిసి ప్రబస్ చేసిన డ్యాన్స్ వావ్ అనిపించింది . ప్రభాస్ చాలా చాలా యాక్టివ్ గా డ్యాన్స్ చేశారు. చాలా కాలం తరువాత తన మనసుకు నచ్చిన వ్యక్తులు తారసపడితే మనసు ఎలా ఉత్సాహంగా ఉరకలు వేస్తుందో అలా ఉత్సాహంగామారిపోయారు . డ్యాన్స్ చేశారు. మొత్తానికి నచ్ బలియే షోకు అందం తీసుకొచ్చారు ప్రభాస్. ఆగష్టు 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ వైబ్ ఉండటంతో అంచనాలు పెరిగాయి. మరి ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.