టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి చాలా రోజుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో మంచి విజయం అందుకున్నాడు. వరుస పరాజయాలతో విసిగిపోయిన పూరికి ఇస్మార్ట్ శంకర్ విజయంతో ఊరట లభించినట్టయింది. పూరి జగన్నాథ్ పని అయిపోయిందనుకున్న వారందరికీ తానేంటో నిరూపించాడు. మాస్ మసాలా కథను ఎంచుకుని తన శైలిలో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమాకి వచ్చినంత బజ్ పూరి జగన్నాథ్ ఏ సినిమాకి రాలేదనే చెప్పాలి.


పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత "డబుల్ ఇస్మార్ట్ " ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా విజయ్ దేవరకొండతో సినిమా ఓకే కావడంతో ప్రస్తుతం ఆ సినిమా  స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడట.అయితే టెంపర్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో ఇంతటి విజయం సాధించిన ఈ సినిమాని తమిళంలో కూడా రీమేక్ చేసే ఆలోచనలు ఉన్నాయట. రామ్ ఈ సినిమాతో హిట్ అందుకొని మళ్లీ ఫామ్లోకి వచ్చారు.


ఈ సినిమా సక్సెస్ సాధించడం తో ఇతర భాషల్లోనూ ఈ సినిమాను రిమేక్ చేసేందుకు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా తమిళం లో ధనుష్ చేత ఈ సినిమాను చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.తమిళ రీమేక్ హక్కుల్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుందని తెలిసింది. ఈ చిత్రం కోసం నిర్మాణ వర్గాలు హీరో ధనుష్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని, మాస్ ఫాలోయింగ్ వున్న ధనుష్ అయితేనే బాగుంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయట.


ఇప్పటికే తెలుగు చిత్రాన్ని చూసిన ధనుష్ రీమేక్‌లో నటించడానికి సుముఖంగా వున్నారని సమాచారం. త్వరలో దీనిపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేల ధనుష్ ఈ సినిమాని ఒప్పుకుంటే ఆయన అభిమానులకి పండగే! ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: