అనిల్ రావిపూడి -సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'సరిలేరునికెవ్వరు'. సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది ఈ చిత్రం. అందులో భాగంగా ఇప్పటికే కాశ్మీర్ లో మొదటి లో షెడ్యూల్ ను పూర్తి కాగా రీసెంట్ గా హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో రెండవ షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఇక మూడవ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగనుంది.
ఈ షెడ్యూల్ కోసం అక్కడ.. కర్నూల్ లోని ఫేమస్ ఫోర్ట్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ ను నిర్మించారు. ఈ సెట్ కోసం ఏకంగా 4 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట నిర్మాతలు. సెప్టెంబర్ మొదటి వారం నుండి మొదలు కానున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు . ఇక కొండారెడ్డి బురుజు మహేష్ కు సెంటిమెంట్. గతంలో ఆయన నటించిన ఒక్కడు సినిమా షూటింగ్ అక్కడే జరిగింది. కొండారెడ్డి బురుజు నేపథ్యం లో వచ్చే సన్నివేశాలు ఆసినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. మరి ఈ సారి కూడా మహేష్ కు ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.
కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. వీరితో పాటు సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.