బాలీవుడ్ బడా హీరోలు హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ లు హీరోలుగా, బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రస్తుతం అత్యంత భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న మల్టీస్టారర్ సినిమా వార్.  ప్రారంభం నాటి నుండి ఈ సినిమా పై బాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఓవైపు హృతిక్ కు, మరోవైపు టైగర్ కు యూత్, 

క్లాస్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడంతో, వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ ఎలా ఉంటుందా అని సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇకపోతే నేడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని యాష్ రాజ్ సంస్థ తమ యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేయడం జరిగింది. హృతిక్, టైగర్ పోటా పోటీగా చేసిన ఫైట్లు, కార్ మరియు బైక్ ఛేజింగ్ సీన్స్, ఈ ట్రైలర్ కు పెద్ద హైలైట్ గా చెప్పవచ్చు. ట్రైలర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ మరియు హీరోయిన్ వాణి కపూర్ అందాలతో ట్రైలర్ అదిరిపోయిందని అంటున్నారు చూసిన ప్రేక్షకులు. 

అంతేకాక ప్రస్తుతం అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ ట్రైలర్ రిలీజ్ తరువాత, సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగాయి. హృతిక్, టైగర్ ఈ సినిమాలో డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు ముగించి గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: