టాలీవుడ్ లో టాప్ కామెడీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తనయులు ఆర్యన్ రాజేష్, నరేష్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నటుడు, దర్శకుడు రవిబాబు తీసిన ‘అల్లరి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  ఆ సినిమానే తన ఇంటిపేరుగా అల్లరి నరేష్ తో టాలీవుడ్ లో పాపులర్ అయ్యాడు.  ఇప్పటి వరకు అల్లరి నరేష్ ఎన్నో సినిమాల్లో నటించాడు..అందులో 2012లో భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘సుడిగాడు’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఈ మూవీ ఒక్క టిక్కెట్టు వంద సినిమాలు అన్న కాన్సెప్ట్ తో ఎన్నో పేరడీలతో అద్భుతంగా అలరించింది.

ఈ మూవీ తర్వాత అల్లరి నరేష్ కి ఏ ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు..మల్టీస్టారర్ మూవీలో నటించిన సక్సెస్ కలిసి రావడం లేదు.  అప్పట్లో అల్లరి నరేష్ నటించిన సుడిగాడు సినిమా దాదాపు 15కోట్ల కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మంచి సక్సెస్ సాధించిన హిట్ ఫార్ములతో సుడిగాడు కథకు సీక్వెల్ తీయాలని ఆడియెన్స్ ఎప్పటినుంచొ కోరుకుంటున్నారు.  కానీ సరైన కథ దొరకపోవడంతో ఈ సినిమా సీక్వెల్ పెండింగ్ పడుతూ వస్తుంది. ఈ మద్య దర్శకులు భీమినేని శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీక్వెల్ పై స్పందించాడు.

సుడిగాడు చాలా మంచి కాన్సెప్ట్ అని వీలైనంత త్వరగా సీక్వెల్ ప్లాన్ చేసేందుకు మంచి కథను రెడీ చేస్తామని తెలిపారు. అయితే మంచి కథ దొరికితే ‘సుడిగాడు’ సీక్వెల్ వస్తే..మళ్లీ అల్లరి నరేష్ కెరీర్ లైన్ లోకి వస్తుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నారు.  ఈ మద్య భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన కౌసల్యా కృష్ణ మూర్తి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. సుడిగాడు సినిమా తర్వాత భీమినేని, అల్లరి నరేష్ ఇద్దరూ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబో సుడిగాడు 2తో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: