అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు వరుస ప్లాపులతో హ్యాట్రిక్ కొట్టిన అఖిల్కు ఈ సినిమా ఎంతో కీలకంగా మారింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ దొరక్క ఐదారు నెలలుగా టీం నానా ఇబ్బందులు పడుతోంది. ఈ సినిమా హిట్ అవ్వకపోతే అఖిల్ సినిమా లైఫ్కే కాకుండా మార్కెట్ పూర్తిగా మైనస్లోకి వెళ్లిపోతుంది.
ఇప్పటికే రెండు భారీ బడ్జెట్ సినిమాలు ప్లాప్ అవ్వడంతో అఖిల్ మార్కెట్ బాగా పడిపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఐదారు నెలలుగా తిప్పలు తప్పడం లేదు. అందుకోసమే షూటింగ్ కూడా ఆగిపోయింది. ముందుగా రష్మిక మందన్నా సెలక్ట్ అయ్యింది అన్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు లైన్లోకి వచ్చినా అవేవి ఫైనల్ కాలేదు.
ఇక తాజాగా పూజాహెగ్డే పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో పెద్దగా క్రేజ్ తెచ్చుకోని పూజా అల్లు అర్జున్ డీజే సినిమాతో దుమ్ము దులిపేసింది. ఆ సినిమాలో అమ్మడి బికిని లుక్స్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. అప్పటి నుంచి పూజాకు స్టార్ హీరోలు ఛాన్సులు ఇస్తున్నారు. తారక్ అరవింద సమేత వీరరాఘవ, మహేష్ మహర్షిలో నటించింది.
ప్రస్తుతం ప్రభాస్ జాన్, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాల్లో నటిస్తుంది. వీటితో పాటుగా అఖిల్ సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసినట్టే కనపడుతోంది. అఖిల్ పక్కన నటించేందుకు పూజా హెగ్దె చేసేందుకు ఆమె ఏకంగా 3.5 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేస్తుందట. ఈ రేటుతో అఖిల్తో పాటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాత రాజు ఫ్యూజులు ఎగిరిపోయాయట. మొత్తానికి ఆమె రేటు తగ్గించుకునేలా బేరసారాలు మొదలయ్యాయ్ అంటున్నారు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.