పవన్ కళ్యాణ్ అంటే జనానికి ఎందుకంత అభిమానమో తెలియదు కాని ఆయన సినిమాల్లో వున్న రాజకీయాల్లోకి వెళ్లినా ఫాలోయింగ్ మాత్రం తగ్గలే.మంచి టైంలో సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లాడు,అక్కడ విజయం సాధించలేకపోయినా,రాజకీయాల్లో తనశైలి ఏంటో నిరూపించాడు.ఇక ఆయన సినిమాలు చేస్తాడ అనేది బిలియన్ ప్రశ్న.ఒకగా నొక సందర్భంలో సినిమాలు చేయను,పూర్తిగా రాజకీయాల్లోనే వుంటానని చెప్పారు,ఆ మాటవిన్న అభిమానులెందరో చాలా హర్ట్ అయ్యారు.అటువంటి వారికి,ఎంతగానో అభిమానించి,ప్రేమించే ఫ్యాన్స్‌కు ఇప్పుడు తీపికబురు వినిపించాడు పవన్.ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన సోదరుడు పవన్ కళ్యాణ్‌ను కలిసి,సినిమా కెరీర్‌ను వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.మరో వైపు అభిమాలను నుంచి కూడా ఒత్తిడి ఉండటంతో సినిమాల వైపు రావాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారట..




ఈ ఏడాది నవంబర్లో పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా సెట్స్ మీదకు వస్తుందని,గతంలో చేస్తానని మాట ఇచ్చిన బేనర్లలోనే ఆయన వర్క్ చేయబోతున్నారని,మొదట మైత్రి మూవీస్ బేనర్లో సినిమా చేస్తారని,దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పని చేస్తారని,హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని సినివర్గాల టాక్.ఇక మైత్రి మూవీస్ బేనర్ సినిమా పూర్తి కాగానే రామ్ తాళ్లూరి బేనర్ ఎస్ఆర్‌టి ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో పవన్ మరో సినిమా కూడా చేయబోతున్నారట.గతంలో సినిమా చేస్తానని రామ్ తాళ్లూరికి ఇచ్చిన మాటను పవన్ ఇపుడు నిలబెట్టుకోబోతున్నారట.ఇక  ఈ సినిమాకు దర్శకుడిగా డాలీ పేరు వినిపిస్తోంది.




అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ చేయబోయే చిత్రాల విషయంలో పక్కా ప్లానింగుతో ఉండబోతున్నాడని,ఆరు నెలలకు ఒక సినిమా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్.వీలైతే ఈ రెండు సినిమాల తర్వాత ఎఎం రత్నంకు అవకాశం ఇస్తారని కూడా వినిపిస్తుంది.గతంలో వీరి కాంబినేషన్లో ‘సత్యాగ్రహి' అనే సినిమా మొదలై ఆగిపోయిన సంగతి తెలిసిందే.ఐతే తాను మళ్లీ నటన వైపు వస్తున్నట్లు పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించలేదు.సినీ వర్గాల్లో జరుగుతున్న ఈ చర్చను పలు మీడియా సంస్థలు తమ బాక్సాఫీస్ న్యూస్ బులిటెన్లలో ఫోకస్ చేసే ప్రయత్నం చేశాయి.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ 2021 వరకు వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడపబోతున్నారనే న్యూస్ ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశంగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: