బాహుబలి సినిమాల తర్వాత నేషనల్ స్టార్ గా మారిపోయిన టాలీవుడ్ యంగ్ రెబల్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులును సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ....ఆ సినిమా ఇచ్చిన ఊపు, ఉత్సహం తో కేవలం కథమీద నమ్మకంతోనే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్లో దాదాపు 350 కోట్లతో నిర్మించిన సాహో సినిమాలో నటించాడు. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో సాహో ఒకేసారి రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ క్రేజ్ ఎలాంటిదో చెప్పడానికి ఈ నాలుగు భాషలు చాలు.
ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని పనులని పూర్తి చేసుకొని ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇక ఈ మద్యే సినిమా నుండి విడుదలైన ట్రైలర్కు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభిస్తుంది. సినిమాలో భారీయాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయంటూ సినిమా విడుదలకి ముందే సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తుండగా , బాలీవుడ్ , కోలీవుడ్ కి చెందిన ప్రముఖ నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ సాహూ కి ప్రధాన హైలైట్ కాబోతుంది అని తెలుస్తుంది. ఇక్కడే దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ కు అందరూ షాక్ అవ్వాల్సిందే అని చిత్ర యూనిట్ చెప్తుంది. ఇక్కడే ప్రభాస్ ఒక్కడా ... ఇద్దరా అనే ట్విస్ట్ ని ఎలివేట్ చేస్తూ దర్శకుడు బ్రేక్ ఇస్తాడని తెలుస్తోంది. కథ కొత్తది కాకపోయినా ప్రభాస్ దర్శకుడు చెప్పిన ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ సీన్లకు ఫిదా అయి ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలిం వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.
మరో మూడు రోజుల్లో ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడబోతుంది. సాహూ రిలీజ్ కి ముందే ప్రభాస్ ఫ్యాన్స్ మంచి కిక్ ఇచ్చే వార్త ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేమిటంటే చెన్నైలోని ఆల్బర్ట్ థియేటర్లో ప్రభాస్ అతి పెద్ద కటౌట్ పెట్టారు అక్కడి ప్రభాస్ అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కి అటువంటి కటౌట్లు కామనే అయినప్పటికీ , మన పక్కనున్న తమిళ తంబిలు ఏర్పాటుచేసిన కటౌట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. రూ.350 కోట్ల బడ్జెట్ లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొని ఉంది. గతంలో ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా ప్రభాస్ వాటినుంచి గుణపాఠాలు నేర్చుకొని మళ్ళీ నిలబడుతూ వచ్చాడు. ఆ సమయంలో రాజమౌళి తో కలిసి చేసిన బాహుబలి ప్రభాస్ ని నేషనల్ స్టార్ గా నిలబెట్టింది. ఈ బాహుబలి చిత్రం కోసం ఐదేళ్లు నిరీక్షించాడు. తాజాగా సాహో చిత్రం కోసం కూడా రెండేళ్లు బాగా కష్టపడ్డాడు. మరో మూడు రోజుల్లోనే సాహో టాక్ బయటకి రాబోతుంది.