టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి నాగచైతన్య హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచిన పూజ హెగ్డే, తొలి సినిమా పర్వాలేదనిపించడంతో కెరీర్ పరంగా కాస్త మెల్లగా ఆమెకు అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగింది. అయితే ఆ తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ ముకుందలో అవకాశం వచ్చినప్పటికీ, ఆ మూవీ ఫ్లాప్ కావడంతో, కెరీర్ పరంగా ఆమెకు కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆపై కొంత గ్యాప్ తరువాత బన్నీ సరసన డీజే సినిమాలో అవకాశం రావడం, 

ఆ సినిమా బాగానే ఆడడంతో, ఈ అమ్మడుకి టాలీవుడ్ లో కాస్త మంచి గుర్తింపు లభించింది. అయితే గత ఏడాది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసిన సాక్ష్యం పర్వాలేదనిపించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించిన అరవింద సమేత సినిమా మాత్రం సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల ఏకంగా సూపర్ స్టార్ మహేష్ ప్రక్కన మహర్షి లో నటించిన ఈ  భామ, ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో, రెండు భారీ విజయాలు తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ సరసన జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్, వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్మీకి, 

అలానే త్రివిక్రమ్ మరియు బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో అనే మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా నటిస్తోంది పూజ. వీటిలో వాల్మీకి వచ్చేనెల 20న రానుండగా, బన్నీ మరియు త్రివిక్రమ్ ల సినిమా వచ్చే సంక్రాంతికి, అలానే ప్రభాస్ తో చేస్తున్న జాన్ వచ్చే ఏడాది మధ్యలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే రెండు భారీ విజయాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఆ మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకుంటే, అదృష్టానికి ఆమడ దూరంలో ఉన్న ఆమె క్రేజ్, ఒక్కసారిగా అమాంతం పెరిగిపోవడం ఖాయం అని అంటున్నారు సినిమా విశ్లేషకులు.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: