మాస్ రాజా రవితేజ  గతంలో మాదిరిగా  బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు నటించడం లేదు . చివరి రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అవడం వల్ల, ఇప్పుడు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చాలా రోజుల తరువాత  సినిమా జానర్ మార్చాడు.రవితేజ తన కెరియర్ లో  మొదటి సారి  డిస్కో రాజా అనే సైన్స్ ఫిక్షన్ మూవీ లో నటిస్తున్నాడు. ఈ సినిమాని ఎక్కడకు పోతావు చిన్నవాడా ఫ్ం కేవి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. 
ఈ సినిమా షూటింగ్  తుది దశకు చేరుకుంది. డిస్కో రాజా లో రాజ్ పుత్ పాయల్ ,నభ నటశా లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జాతీయ ఉత్తమ సహాయక నటుడిగా అవార్డు పోందిన బాబి సింహా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనుపించనున్నాడు. రవితేజ నెక్ట్స్ సినిమాకు సంబధించిన  న్యూస్ బయటకు వచ్చింది. తమిళ బ్లాక్ బాస్టర్   సినిమా ‘విక్రమ్‌ వేద’ రీమేక్‌లో రవితేజ నటించబోతున్నాడు.ఈ రీమేక్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా లో మాధవన్ మరియు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు.ఇందులో  విక్రమ్‌ ఎన్ కౌంటర్ స్పెషల్టి, వేద ఒక గ్యాంగ్ స్టార్. కొన్ని అనుకొని సంఘటనలు వల్ల వీరు శత్రువులుగా మారుతారు దాని వల్ల ఇద్దరి జీవితాలు  టర్న్ తీసుకుంటాయి.
ఇందులో రవితేజ ఎన్ కౌంటర్ స్పెషల్టి గా కనిపించనున్నాడు. ఇది మాస్ రాజా కు సరిపోయే క్యారక్టర్.  . గ్యాంగ్ స్టార్ క్యారెక్టర్ చాలా ఇంపార్టంటే దానికి  కార్తికేయను   అనుకుంటున్నరని టాక్. "రణరంగం’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్‌ వర్మ ఈ రీమేక్‌కు డైరెక్షన్‌ చేయబోతున్నాడు.తెలుగు నెటివిటికి సరిపోయేలా కొన్ని మార్పులు చేస్తున్నారు.  ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతుంది. తమిళ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన శ్రీకాంత్ తెలుగు సినిమాకు కూడా ఫ్రోడ్యూస్ చేయనున్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: