పెళ్లి చూపులు సినిమాతో  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రీతూ వర్మ.  అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం  అప్పట్లో సంచలనం రేపింది.  ఈసినిమాలో నటించిన  హీరో విజయ్ దేవరకొండ తో పాటు రీతూ వర్మ కుకూడా మంచి పేరొచ్చింది.  ఇక ఈ సినిమా తరువాత విజయ్  వరుసగా  అవకాశాలు సంపాదించుకోగా  రీతూ వర్మ కు మాత్రం నిరాశనే ఎదురయ్యింది. పెళ్లి చూపులు తర్వాత రీతూ వర్మ, కేశవ అనే సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా ఆమె కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు. 




ఇక ఆ  సినిమానే తెలుగులో ఆమె చివరగా చేసింది.   ఆ తరువాత రీతూ  తమిళం లో ధనుష్ 'వీఐపీ 2' లో నటించింది.  ఈ సినిమా కూడా పెద్దగా ఉపోయోగపడలేదు. కాగా  ఆమె ప్రస్తుతం  మలయాళం లో దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమాలో నటించింది. ఆ చిత్రం విడుదలకావాల్సి వుంది.  ఇక ఇదిలా ఉంటే ఇక ఎట్టకేలకు సుమారు రెండు సంవత్సరాల తరువాత  మళ్ళీ తెలుగు సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ కొట్టేసింది  రీతూ వర్మ.  ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తో  శ్రీ కార్తీక్ ఓ సినిమా తెరకెక్కించనున్నాడు.




ఈ చిత్రం ఈ రోజే లాంచ్ అయ్యింది. ఈ చిత్రంలో  రీతూ వర్మ, శర్వా కు జోడీగా నటించనుంది.  ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా  టాక్సీవాలా ఫేమ్ జెక్స్ బిజోయ్ సంగీతం అందించనున్నాడు.  ఇక ఈ చిత్రానికి పెళ్లి చూపులు డైరెక్టర్  తరుణ్ భాస్కర్ మాటలు రాస్తుండడం విశేషం. మరి ఈ చిత్రమైన  రీతూ వర్మ కు బ్రేక్ ఇస్తుందో  లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: