సాధారణంగా హీరోయిన్లు తమ కెరీర్ లో మంచి సినిమాల్లో నటించాలని చూస్తుంటారు. అదే విధంగా స్టార్ హీరోయిన్ల సరసన ఛాన్స్ దొరికితే అంతకన్నా భాగ్యం లేదనుకుంటారు. అయితే ఒకప్పుడు సీనియర్ హీరోలతో నటించిన అతిలోక సుందరి శ్రీదేవి తర్వాత తరం హీరోలతో అంతేందుకు నాగేశ్వరరావుతో నటించిన ఆమె ఆయన తనయుడు నాగార్జునతో కూడా నటించింది.  ఇలా అతి కొద్ది మాత్రమే రెండు జనరేషన్లతో నటించిన వారు ఉన్నారు.  ఇక కలువ కళ్ల సుందరి కాజల్ అయితే మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాన్, రాంచరణ్ ఇలా మూడు జనరేషన్ హీరోలతో నటించింది.

తాజాగా ఇప్పుడు ఓ హీరోయిన్ బాబాయి, అబ్బాయిలతో నటిస్తుంది. వివరాల్లోకి వెళితే.. కొంత కాలంగా సరైన హిట్స్ లేకు సతమతమవుతున్నాడు నిర్మాత, హీరో కళ్యాన్ రామ్. ఈ ఏడాది విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ 118 కళ్యాణ్ రామ్ కు మంచి విజయాన్ని అందించింది. దీనితో కళ్యాణ్ రామ్ ఇకపై విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫిక్సయ్యాడు.  ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘ఎంత మంచివాడవురా’ అనే మూవీలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ లో అందాల భామ నటాషా దోషి ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందట. 

ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులని మెప్పించేలా నటాషా అందాలు ఆరబోయనునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఆ మద్య బాలకృష్ణ నటించిన జైసింహా సినిమాలో  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో నటాషా ఓ హీరోయిన్ గా నటించింది. అప్పట్లో తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఇక కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ సినిమా ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మిస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: