నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా శతమానంభవతి, శ్రీనివాస కళ్యాణం సినిమాల దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఎంత మంచివాడవురా. మంచి ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు రావడం జరిగింది. ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా కామెడీ చిత్రాలను కమర్షియల్ హంగులతో తెరకెక్కించగల యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ప్రతిరోజు పండుగే. 

ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఇకపోతే ఈ రెండు సినిమాలతో పాటుగా ఇప్పుడు మరొక హీరో సినిమా కూడా క్రిస్మస్ బరిలో నిలిచింది. యంగ్ హీరో నితిన్ హీరోగా ఛలో సినిమా దర్శకుడు వెంకీ కుడుములు దర్శత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా భీష్మ. సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ లైన్ తో ఒక విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. 

మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్  చేయడం జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అఆ' సినిమా తరువాత కెరీర్ పరంగా ఇప్పటివరకు సరైన హిట్ లేని నితిన్, ఎలాగైనా ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి క్రిస్మస్ బరిలో నిలిచిన ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం, మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: