సూపర్ స్టార్ మహేష్ మహర్షి తర్వాత కొద్దిరోజుల్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమా మొదలుపెట్టాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ పరశురాం డైరక్షన్ లో సినిమా ఓకే చేశాడట.


అసలైతే సుకుమార్ డైరక్షన్ లో మహేష్ సినిమా ఉండాల్సింది కాని బన్నితో తను సినిమా ఫిక్స్ చేసుకోవడం వల్ల మహేష్ వెంటనే అనీల్ రావిపుడి సినిమా ఫైనల్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రం, సందీప్ వంగ లైన్ లో ఉన్నా పరశురాం చెప్పిన ఫైనల్ వర్షన్ నచ్చడంతో అతనికి ఓకే చెప్పాడట మహేష్.   


ఈ సినిమా కొరటాల శివ, గీతా ఆర్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ కలిపి నిర్మిస్తారని తెలుస్తుంది. మహేష్ ను మెప్పించే కథ చెప్పాడంటే పరశురాం మరోసారి అదిరిపోయే కథ సిద్ధం చేశాడని అంటున్నారు. గీతా గోవిందం తర్వాత సంవత్సరం పాటు టైం తీసుకున్న పరశురాం 2020 జనవరిలో మహేష్ సినిమా మొదలుపెడతారట.


ఆగష్టు 7కి రిలీజ్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబదించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేస్తుందని అంటున్నారు. అంతా బాగుంది కాని ఈ కాంబినేషన్ సెట్ చేసింది గీతా ఆర్ట్స్ కోసం అనుకుంటే సడెన్ గా కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ లోకి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ గీతా ఆర్ట్స్ తో మహేష్ సినిమా వేరే దర్శకుడు ఫిక్స్ అయ్యాడా అన్న డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: