ఇక అదే సమయంలో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న భీష్మ అలాగే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ , ప్రతిరోజు పండగే సినిమాలు కూడా విడుదలకానున్నాయి. దాంతో ఈ క్రిస్మస్ కు బాక్సాఫీస్ వద్ద మంచి త్రిముఖ పోరు జరగనుంది. మరి ఈ పోరులో ఎవరు ఫైచేయి సాధిస్తారో చూడాలి. కాగా ఈముగ్గురి హీరోలకు ఈసినిమాల విజయం కీలకం కానుంది.
సైన్టిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఫై నేల టిక్కెట్టు నిర్మాత రవి తాళ్లూరి నిర్మిస్తున్న డిస్కోరాజా లో నాభా నటేష్ , పాయల్ రాజ్ పుత్ , తాన్యా హాప్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు బాబీ సింహ విలన్ గా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా ఫై రవితేజ భారీ ఆశలు పెట్టుకున్నాడు.