ప్రభాస్ సాహో సినిమా విడుదలైంది.. అంతటా సాహో సందడి నెలకొంది. మరి ఈ సమయంలో మెగా హీరో రామ్ చరణ్ సాహోకు వెల్ కమ్ చెప్పడమేంటి అంటారా.. అవును ఆయన సాహో సినిమాకు వెల్ కమ్ చెప్పారు. నెల్లూరుజిల్లాలో వి సెల్యులాయిడ్ సినిమా ధియేటర్ ను హీరో రాంచరణ్ ప్రారంభించారు. ఆ థియేటర్‌లో సాహో సినిమాను ప్రదర్శిస్తున్నారు. అంటే సాహోకు రామ్ చరణ్ స్వాగతం చెప్పినట్టేగా..


ఇక ఆ ధియేటర్ ప్రారంభోత్సవ వివరాలు తెలుసుకుందాం.. ఈ థియేటర్ ను సూళ్లూరుపేట మండలం పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకోని పిండిపాలెం లోని ఒకే ప్రాంగణంలో నూతన టెక్నాలజీ తో నిర్మించారు. ఎపిక్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. రాంచరణ్ ముఖ్య అతిథిగా వచ్చి ధియేటర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం థియేటర్లోనే పలు సినిమా ట్రైలర్లను తిలకించారు.


ఒకే ప్రాంగణంలో మూడు తెరలతో మంచి డిజిటల్ సౌండ్ తో థియేటర్ ను నిర్మించడం ఆనందంగా ఉందన్నారు రామ్‌ చరణ్ . సూళ్లూరుపేట అభివృద్ధి పథంలో ఉన్నందున అన్ని నూతన టెక్నాలజీకి సంబంధించిన ఇలాంటివి ఉండడం నెల్లూరు జిల్లా ప్రేక్షకులు చేసుకున్న అదృష్టమని అన్నారు.


ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వంశీ రెడ్డి, విక్రమ్ రెడ్డి, వారి పెద్దలకు శ్యాంసుందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సూళ్లూరుపేట ప్రాంతం అనగానే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రపంచపటంలోలనే ప్రాధాన్యత కలిగిన షార్ ప్రాజెక్టు అని కొద్దిరోజులలో చందమామని ప్రపంచమంతా చూపించగలిగే స్థాయి షార్ ప్రాజెక్టు అని అలాగే నేలపట్టు, పులికాటు, మాంబట్టు ఇలాంటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఈ సూళ్లూరుపేట ప్రాంతం అటువంటి సూళ్లూరుపేట లో మరో వి ఎపిక్ థియేటర్ ఇక్కడ నిర్మాణం చేసి సూళ్లూరుపేట ప్రాధాన్యతను చాటుకున్నారని తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: