సాధారణంగా సంక్రాంతికి సినిమాల వార్ జరుగుతుంది. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు రాబోతున్న క్రిస్మస్ కు ఏకంగా నాలుగు మిడిల్ రేంజ్ సినిమాల మధ్య వార్ జరగబోతు ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. నితిన్ ‘భీష్మ’ ‘రవితేజా డిస్కోరాజా’ శర్వానంద్ సమంతల ‘96’ రీమేక్ తో పాటు ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘ప్రతిరోజు పండగే’ ఈ రేసులో చేరడం అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

వాస్తవానికి తేజ్ తన సినిమాను సంక్రాంతి రేసులో నిలపాలని భావించి అనేక రాయబారాలు చేసినట్లు టాక్. అయితే అల్లు అరవింద్ తేజ్ రాయబారాలకు స్పందించక పోవడమే కాకుండా అల్లు అర్జున్ మూవీతో పోటీకి రావడం తేజ్ కెరియర్ కు ఏమాత్రం మంచిది కాదనీ రివర్స్ క్లాస్ పీకడంతో మరొక మార్గం లేక ఇప్పుడు తేజ్ ఈ క్రిస్మస్ రేస్ లోకి వచ్చి చేరినట్లు సమాచారం. 

సంక్రాంతికి మహేష్ బన్నీల సినిమాలతో పాటు కళ్యాణ్ రామ్ సినిమా కూడ విడుదల కావడం ఖాయం అయిన నేపధ్యంలో ధియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అంటూ బన్నీ సినిమాను తీస్తున్న అల్లు అర్జున్ తేజ్ ను ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో తనకు ఇష్టం లేకపోయినా మరొక మార్గం లేక తేజ్ తన ‘ప్రతిరోజు పండగే’ మూవీని క్రిస్మస్ రేస్ కు దించుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే క్రిస్మస్ పోటీని కూడ తేజ్ సినిమా తట్టుకోలేదనీ అందువల్ల అతడి సినిమాను ఫిబ్రవరికి మార్చుకుంటే అన్ని విధాల మంచిది అంటూ తేజ్ కు మెగా కాంపౌండ్ సలహాలు ఇస్తున్నట్లు టాక్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ పై మెగా మేనల్లుడుకి భారీ అంచనాలు ఉన్నా సరైన రిలీజ్ టైమ్ దొరకక ప్రస్తుతం ఈ మెగా యంగ్ హీరో తీవ్ర అంతర్మధనంలో ఉన్నట్లు వార్తలు రావడమే కాకుండా ఒక విధంగా బన్నీ వల్ల తేజ్ నష్టపోతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: