టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి వంటి మూడు భారీ నిర్మాణ సంస్థలపై రూపొందించబడి, భారీ అంచనాలతో మొన్న మే9న రిలీజ్ అయి, అతి పెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా మహర్షి. సూపర్ స్టార్ మహేష్ బాబు, మూడు రకాల ఛాయలున్న పాత్రల్లో నటించిన ఈ సినిమాలో స్నేహబంధంతో పాటుగా, రైతులకు సంబందించిన మంచి అంశాన్ని కూడా స్పృశించి, దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం జరిగింది. మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక సిల్వర్ జూబిలీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మహర్షి సినిమా, ఇటీవల సక్సెస్ఫుల్ గా మూడు కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం. 

ఇక కొద్దిరోజల క్రితం ఈ సినిమా నుండి ముందుగా ఒక డిలీటెడ్ సీన్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. కాలేజీ నేపథ్యంలో సాగె ఆ సన్నివేశంలో మహేష్, కమల్ కామరాజుల మధ్య జరిగిన కొద్దిపాటి గొడవ, ఆ తరువాత మహేష్ తో కలిసి హీరోయిన్ పూజ ఫ్రెండ్ షిప్ చేయడం వంటి సన్నివేశాలు అందులో చూడవచ్చు. దాని తరువాత రిలీజ్ చేసిన రెండవ డిలీటెడ్ సీన్ లో మహేష్ బాబు, అమ్మాయిలని ఒక్కొక్కరుగా ఫ్లాట్ చేయడం, అదంతా హీరోయిన్ పూజ హెగ్డే గమనించడం వంటి సన్నివేశాలు ఆ సీన్ లో చూడవచ్చు. ఇకపోతే కాసేపటి క్రితం, హీరో చిన్న పిల్లాడుగా ఉన్నపుడు, తన తండ్రి ప్రకాష్ తో కలిసి నటించిన మనసుని తాకే ఒక మంచి సన్నివేశాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సినిమాలో హీరో పిల్లాడిగా ఉన్న సమయంలో, తన తండ్రి చేసిన అప్పుని వసూలు చేసుకోవడానికి ఇంటికి వచ్చిన వ్యక్తి, తండ్రైన ప్రకాష్ రాజ్ ని తిట్టి వెళ్లిన తరువాత జరిగే సన్నివేశంగా దీనిని అర్ధం చేసుకోవచ్చు. 

మనకే ఏమి లేదు కదా నాన్న, అయినప్పటికీ మీరు వేరొకరికోసం అప్పు ఎందకు చేసారు అని కొడుకు అడిగిన ప్రశ్నకు జవాబుగా 'మనం పుడతాం, పెరుగుతాం, బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి, లైఫ్ లో సెటిల్ అయి మంచి కారు, ఇల్లు సంపాదిస్తాం. అయితే అవన్నీ మన స్వార్ధం కోసం చేస్తాం, కానీ మన మనసు సంతోషం కోసం మన ప్రక్కవారికి కూడా చేతనయినంత సాయం చేయాలి' అంటూ ప్రకాష్ రాజ్ నటించిన ఈ సీన్, ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: