రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో నిన్న విడుదలై పూర్ రేటింగ్స్ ను రాబట్టుకున్న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంది. మొదటి రోజు ఈచిత్రం ఏపీ &తెలంగాణలో 35 కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. అందులో భాగంగా నైజాం లో 9.40 కోట్ల షేర్ ను రాబట్టి నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది.
ఇక సీడెడ్ లో మాత్రం ఈసినిమా దారుణంగా నిరాశపరించింది. అక్కడ ఈచిత్రం 25కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా మొదటి రోజు కేవలం 4.40 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక ఇంత నెగిటివ్ మౌత్ టాక్ తో ఫుల్ రన్ లో ఈ సినిమా 100 కోట్ల చేరడం దాదాపుగా అసాధ్యంగా కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 125కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. అయితే ఈమూడు రోజులు సెలవు దినాలు కావడం అలాగే థియేటర్లలో వేరే సినిమాలు లేకపోవడం సాహో కు కలిసి రానుంది.
ఇక బాలీవుడ్ లో మొదటి రోజు ఈ చిత్రం సత్తా చాటింది. ప్రింట్ లు లేటుగా రావడం తో అక్కడ షోస్ ఆలస్యంగా స్టార్ట్ అయ్యాయి. అయినా కూడా మొదటి రోజు ఈ చిత్ర హిందీ వెర్షన్ 24కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. అయితే నెగిటివ్ టాక్ కూడా విపరీతంగా స్ప్రెడ్ కావడంతో అక్కడ కూడా బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించగా భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.