స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత చేస్తున్న అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈమధ్యనే వచ్చిన అల వైకుంఠపురములో ఫస్ట్ లుక్ టీజర్ ఇంప్రెస్ చేసింది.


ఈ సినిమా తర్వాత బన్ని సుకుమార్ డైరక్షన్ లో సినిమా లైన్ లో ఉంచాడు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. ఇక ఈ సినిమా తర్వాత వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా కూడా చేయాల్సి ఉంది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కే ఆ సినిమా కూడా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు బన్ని.


ఇవే కాకుండా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు అల్లు అర్జున్. అసలైతే లిగుసామితో ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉన్నా అది మిస్సైంది. అందుకే ఇప్పుడు మురుగదాస్ తో అల్లు అర్జున్ సంప్రదింపులు జరుపుతున్నారట. తమిళ దర్శకుడు మురుగదాస్ కు నేషనల్ వైడ్ గా క్రేజ్ ఉంది. తమిళంలోనే కాదు హిందిలో కూడా అతను హిట్ కొట్టాడు.  


కాని తెలుగులో మురుగాదాస్ తీసిన రెండు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ చేసిన మురుగదాస్ మహేష్ తో స్పైడర్ సినిమా చేశాడు. రెండు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇక ఇప్పుడు మురుగదాస్ తో బన్ని ప్రయోగం చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నమైనా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. బన్ని కోలీవుడ్ ఎంట్రీకి మురుగదాస్ అయితే పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: