సంక్రాంతి తెలుగింటి పండుగ.  కానీ సినిమా వాళ్లకు సినిమా పండుగ.  కొత్త కొత్త సినిమాలు థియేటర్లో సందడి చేస్తుంటాయి.  ప్రతి సంక్రాంతికి థియేటర్లు కళకళలాడుతుంటాయి.  కారణం ఏంటో తెలుసా.. తెలుగు ప్రజలంతా సినిమాలకు వెళ్లాలని అనుకోవడమే. ఊర్లకు వెళ్లిన ప్రజలు అక్కడి వాళ్లతో కలిసి తప్పకుండా సినిమాకు వెళ్తారు.  సంక్రాంతికి సెలవులు ఉంటాయి కాబట్టి సినిమాలు చూస్తారు. అందుకే సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉంటుంది.  


వచ్చే సంక్రాంతికి పోటీ భారీగా ఉన్నది.  మహేష్ సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో, రజినీకాంత్ దర్బార్, బాలకృష్ణ కొత్త సినిమాలు వస్తున్నాయి.  ఈ నాలుగు సినిమాలకు హైప్ ఉన్నది.  మహేష్ బాబు సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్.  ఆర్మీ బ్యాక్ డ్రాప్ సినిమా అయినప్పటికీ .. సినిమాను పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.  


కామెడీ పార్ట్ ను టచ్ చేయడం వలన సంక్రాంతికి కాసులు రాలతాయని అనిక్ రావిపూడి ప్లాన్.  సినిమా ప్రారంభం అయినప్పుడే అనిల్ సినిమా రిలీజ్ ఎనౌన్స్ చేశారు.  దానికి తగ్గట్టుగానే సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ చేస్తున్నారు.  విజయశాంతి చాలా కాలం తరువాత తిరిగి మేకప్ వేసింది.  రష్మిక మందన్న హీరోయిన్.  


ఎంటర్టైనర్ సినిమా అయినప్పటికీ ఇందులో మహేష్ ఫ్యాన్స్ కు కావలసిన మసాలా అంతా ఉంటుంది.  మాస్ అభిమానులు మెచ్చే ఫైట్ టానిక్ ను ఫుల్ గా నింపుతున్నాడు.  ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి ఫన్ టానిక్ ను నింపుతున్నాడు.  వెరసి సంక్రాంతికి నవరసాలను జోడించి సరిలేరు నీకెవ్వరూ ను తయారు చేస్తున్నాడు.  నిన్నటి వరకు మొదటిరోజు వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాల్లో మహేష్ బాబు సినిమా మహర్షి ఉండేది.  


ఈ మూవీ 24.18 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నది.  అయితే, నిన్న సాహో రిలీజ్ అయ్యాక గణాంకాలుమారిపోయాయి .  సాహో ఫస్ట్ డే 36 కోట్ల షేర్ ను వసూలు చేసింది. దీంతో బాహుబలి2 తరువాత సెకండ్ ప్లేస్ లో సాహో నిలిచింది. ఎన్టీఆర్ అరవింద సమేత మూడో స్థానంలోనూ, అజ్ఞాతవాసి నాలుగో స్థానంలోనూ, వినయ విధేయ రామ ఐదో స్థానంలోనూ ఉన్నాయి.  వచ్చే ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ సినిమాతో తిరిగి టాప్ 5 సినిమాల్లో మహేష్ స్థానం సంపాదించుకుంటాడని ఆశిద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: