మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.  ఆ తరువాత మహేష్ పరశురామ్ తో గాని లేందంటే.. సందీప్ రెడ్డి వంగతో గాని ఉండొచ్చు.  అందులోసందేహం అవసరం లేదు.  సరిలేరు నీకెవ్వరూ తరువాత వెంటనే సినిమా ప్రారంభం చేయాలని మహేష్ బాబు అనుకుంటున్నారు.  అదే ఏడాది దసరాకు నెక్స్ట్ సినిమాను రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.  


ఈ సినిమా తరువాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయాలని అనుకుంటున్నారు.  ఎప్పటి నుంచో రాజమౌళితో సినిమా ఉంటుంది అనుకున్నా కుదరడం లేదు.  ఈసారి తప్పకుండా మహేష్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.  అయితే అది కేవలం మహేష్ బాబు ఒక్కడితో కాకుండా.. ఆర్ఆర్ఆర్ తరహాలోనే ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తారని సమాచారం.  


అందులో అక్కినేని హీరో నాగ చైతన్య కూడా నటించబోతున్నారని తెలుస్తోంది.  చైతు కూడా రాజమౌళితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.  కానీ, కుదరడం లేదు.  ఈసారి ఎలాగైనా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.  ఎలాగో సమంత రాజమౌళితో ఈగ సినిమా చేసింది.  సమంత నటనకు రాజమౌళి ఫ్లాట్ అయ్యాడు.  


దీంతో సమంత రాజమౌళితో ఈ విషయం గురించి ఇప్పటికే మాట్లాడినట్టు తెలుస్తోంది.  మహేష్ బాబు, నాగ చైతన్య కాంబినేషన్లో సినిమా చేయబోతున్నారని టాక్.  దానికి సంబంధించిన కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారని, ప్రస్తుతం అదే పనిమీద విజయేంద్ర ప్రసాద్ ఉన్నారని తెలుస్తోంది. 

ఒకవేళ ఇది నిజమైతే.. ఇండస్ట్రీలో ఆర్ఆర్ఆర్ తరువాత మరో సంచలన సినిమా ఇదే అవుతుంది.  సో, ఆ వార్తను రాజమౌళి అండ్ కో అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే కదా. ఒకవేళా ఈ కాంబినేషన్లో సినిమా అంటే.. మహేష్ బాబు ప్రొడక్షన్స్ తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: