టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకు వచ్చిన నటి శ్రీరెడ్డి తాజాగా యంగ్ రెబల్ స్టార్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం మంచి ఫామ్ లో ఉండగానే పవన్ కళ్యాన్ ని టార్గెట్ చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.  ఒకదశలో ఆమెతో పవన్ ఫ్యాన్ బీభత్సంగా ట్రోల్ చేశారు.  దాంతో కొంత కాలం సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి తనకు అన్ని వైపులా మద్దతు లభించకపోవడంతో చెన్నై వెళ్లిపోయింది. 

ప్రస్తుతం అక్కడే ఉంటూ సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా సెలబ్రెటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె మాత్రం అస్సలు తగ్గడం లేదు. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో శ్రీరెడ్డి ఫాలోవర్లు కూడా అరవై లక్షలకు పైగానే ఉన్నారు. తాజాగా  శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు.   ప్రభాస్ ప్రవర్తన చాలా కూల్‌గా, మర్యాదపూర్వకంగా ఉంటుంది. అదే సమయంలో అతడు కూర్చునే విధానం రాయల్‌గా కనిపిస్తుంది. డ్రీమ్ బాయ్.. నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నాను అంటూ ఆ పోస్టులో పేర్కొంది. 

ప్రతిసారీ హీరోలపై సంచల వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి అనూహ్యంగా ప్రభాస్ పై ప్రశంసలు కురిపించడం పై అందరూ ఆశ్చర్యపోయారు.  అయితే, మొదటిసారి ప్రభాస్‌పై మాత్రం పాజిటివ్‌గా మాట్లాడింది. దీంతో ఈ పోస్ట్ చర్చనీయాంశం అయింది. కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. ప్రభాస్ సినిమా సాహోపైనా వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ తన ‘డ్రీమ్ బాయ్’ అని పేర్కొంటూ.. సాహో సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. దీంతో అందరూ ప్రభాస్‌పై శ్రీరెడ్డి మనసు పారేసుకుందని కామెంట్లు చేశారు.  ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘సాహో ఎలా ఉంది..? ఇది హిట్టేనా..?’ అని పోస్ట్ చేసింది. 

ప్రభాస్ పై ప్రశంసలు కురిపించడంపై పవన్ ఫ్యాన్స్ మరోసారి సీరియస్ అవుతున్నారు. ‘పీఈకే ఫ్యాన్స్ గొర్రెల్లారా మారరా..? ఏంట్రా మీరు ప్రభాస్ మూవీ మీద పడి ఏడుస్తున్నారు..?’ అని అందులో పేర్కొంది. అయితే శ్రీరెడ్డి ఆంతర్యం ఏంటో అందరికీ అర్థం అవుతుందని..ఆమె మరోసారి పవన్ కళ్యాన్ టార్గెట్ చేసుకుందని అంటున్నారు.  దీంతో శ్రీరెడ్డిపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఇద్దరు హీరో అభిమానుల మధ్య గొడవ జరిగేలా ఆమె చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. ఈసారి పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో ముందు ముందు తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: