సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ మరియు సితార లకు సంబందించి తన హ్యాపీ మూమెంట్స్ ని అభిమానులతో ఎప్పటికపుడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసుకుంటుంటారు మహేష్ బాబు. ఇక వారిద్దరిలో సితార ఒకింత చలాకీగా వ్యవహరించడం అక్కడక్కడా కొన్ని వీడియోల్లో చూసాం. ఇక గౌతమ్ 13వ జన్మదిన వేడుకలను, కుటుంబ సభ్యుల మధ్య నేడు ఘనంగా నిర్వహించినట్లు సమాచారం. మహేష్ బాబు మరియు నమ్రత ఇద్దరూ కూడా తమ కుమారుడు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకొని, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా వర్ధిల్లాలని దీవిస్తూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నేడు పోస్టులు పెట్టడం జరిగింది. ఇక మరోవైపు సూపర్ స్టార్ దంపతుల కుమార్తె సితార ఇటీవల కొద్దిరోజుల క్రితం, 

దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్త ఆద్యతో కలసి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక కొద్దిరోజుల క్రితం తన తండ్రి జన్మదినం మరియు నేడు తన అన్నయ్య జన్మదినం సందర్భంగా తన ఛానల్ ద్వారా సితార వారిని విష్ చేయడం జరిగింది. అంతేకాదండోయి, రేపటి వినాయక చవితి పండుగ పర్వదినాన, అందరూ కూడా ఎటువంటి రంగులతో తయారుచేసిన వినాయకుని ప్రతిమలను వినియోగించవద్దని, స్వచ్ఛమైన మట్టితో చేసిన గణపయ్య ప్రతిమలనే వాడాలని ఆద్యతో కలిసి ఎకో గణేశా అనే వీడియోని రూపొందించి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది సితార. 

ఇక ఈ వీడియో చూసిన పలువురు సినిమా ప్రముఖులు మరియు ప్రేక్షకులు సితార, ఆద్యలను మెచ్చుకుంటూ గో గ్రీన్ అనే నినాదంలో భాగంగా మట్టి వినాయకుని అందరూ వినియోగించాలంటూ, ఈ ఇద్దరు చిన్నారులు తమవంతుగా చేసిన ప్రయత్నం బాగుందంటూ, ఆ వీడియోపై పొగడ్తలు కురిపిస్తూ ప్రశంసిస్తున్నారు. ఇక ఆ వీడియోను సూపర్ స్టార్ ఫ్యాన్స్ మరింతగా లైక్స్ మరియు షేర్స్ తో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్ వేయండి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: