జాహ్నవి కపూర్ తాజాగా నటిస్తున్న సినిమా గుంజన్ సక్సేనా కార్గిల్ గర్ల్. ఈమె ఇండియన్ ఎయిర్ఫోర్స్ మొదటి పైలెట్ మాత్రమే కాదు మొట్టమొదటి మహిళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరఫున యుద్ధానికి వెళ్లడం కూడా ఈమె కే దక్కింది. తాజాగా బయోగ్రఫీ మీద సినిమాలు తీయడం ఆనవాయితీగా మారింది అందున వచ్చే సంవత్సరంలో ఇటువంటి ఎన్నో బయోగ్రఫీ రిలీజ్ కాబోతున్నాయి.

ఆగస్టు 31 తారీకు 2019 న సెక్సీ నా పుట్టిన రోజు కావడంతో ఆ రోజు జాహ్నవి కపూర్ తన ట్విట్టర్లో ఈ విధంగా స్పందించారు. భారతదేశపు యువతరానికి మీరు ఒక స్ఫూర్తిగా నిలిచారు మీరు ఒక హీరో అవ్వాలని అనుకోకపోయినా మా అందరికీ మీరు ఒక హీరో అయ్యారు. మీ కథ విన్న తర్వాత నాలో ఆత్మ విశ్వాసం రెట్టింపు అయింది అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు నా ఆదర్శం అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనుకాడను.

ఇటీవలే జాహ్నవి కపూర్ తన తదుపరి చిత్రం యొక్క ఫోటో స్టిల్స్ ను తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది ఇందుకు అనూహ్యమైన స్పందన కూడా లభించింది ఇంస్టాగ్రామ్ లో తరచుగా ఈమె తన తదుపరి చిత్రం యొక్క స్టిల్స్ను షేర్ చేస్తూ ఫాన్స్ యొక్క క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ మహిళా పైలెట్గా ఆమె ఆ రూపంలో చక్కగా అది పోయినట్టుగా స్టిల్స్ లో మనం చూడవచ్చు.

డిసెంబర్ 2018 లో మొదలైన ఈ సినిమా మార్చి 2020 కి ప్రజల ముందుకు రానుంది. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫాన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ కి సంబంధించిన సినిమా కావడంతో బిజెపి వారి మద్దతు కూడా ఈ సినిమాకి కచ్చితంగా ఉంటుంది. ఇది ఎటువంటి రాజకీయ విభేదాలకు తిరగకుండా సాఫీగా రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: