దర్శకుడు రాజమౌళి.. వర్ధమాన దర్శకులు, హీరోలు చేసే మంచి చిత్రాలను ప్రశంసించడంలో ఎప్పుడూ ముందుంటాడు. అర్జున్రెడ్డి సినిమాతో యూత్ను ఫిదా చేసిన విజయ్ దేవరకొండను రాజమౌళి ఎంతో ప్రశంసించారు. తనకు నచ్చిన సినిమాలు, తన సన్నిహితుల సినిమాలను సక్సెస్తో సంబంధం లేకుండా రాజమౌళి సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ ఉంటాడు. రాజమౌళి సన్నిహితుడు సాయి కొర్రపాటి చేసిన సినిమాలు ప్లాప్ అయినా వాటిని ప్రశంసించేవాడు రాజమౌళి.
ఒక్క తెలుగు భాషలోనే కాదు... ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను కూడా రాజమౌళి పొగుడుతూ ఉంటాడు. కన్నడ హీరో సుదీప్ తాజా చిత్రం ‘పెహల్వీన్’ టీజర్ ను రాజమౌళి షేర్ చేసి కొనియాడారు. అయితే బాహుబలితో నెషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించిన ప్రభాస్… సాహో ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి ఆ సినిమా విడుదలై మూడు రోజులు అవుతున్నా సోషల్ మీడియా వేదికగా ఎలాంటి స్పందనా తెలియ జేయకపోవడం షాకింగ్గా మారింది.
సాహో సినిమాకు టోటల్గా నెగిటివ్ టాక్ వచ్చింది. ఫ్లాప్ అన్న రివ్యూలు, మరోవైపు సహజంగా బెస్ట్ క్రియేటర్ అని పేరున్న రాజమౌళి సినిమా ఫలితం చూసే స్పందించ లేదని కొందరు అంటున్నారు. ప్రభాస్కు బాహుబలితో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ సాహోతో రెట్టింపు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఆశలు అడియాశలు అయ్యాయి.
సాహో ప్రభాస్ ఇమేజ్ను ఎంతైనా డ్యామేజ్ చేసింది. ఈ టైంలో సాహోపై స్పందించాల్సి ఉంటే పాజిటివ్గానే స్పందించాలి.. కానీ రిజల్ట్ వేరుగా ఉంది. అందుకే రాజమౌళి ఎలాంటి రిస్క్ చేయలేదని.. రాజమౌళి స్పందించకపోవడం వెనుక కారణం ఇదేనని అందరూ అంటున్నారు. ఇక సాహో ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ.206 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి నెగిటివ్ టాక్తో కూడా దూసుకుపోతోంది.