టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో ప్రస్తుతం రూపొందుతున్న క్రేజీ మూవీ అల వైకుంఠపురములో. గతంలో బన్నీ సరసన డీజే సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే, ఈ సినిమాలో మరొక్కసారి ఆయన సరసన జోడి కడుతోంది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ ఫోటోగ్రాఫర్ పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్, 

సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచడం జరిగింది. ఇకపొతే నేడు ఈ సినిమా స్టోరీ విషయమై ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమా కూడా గతంలో బన్నీ, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి మాదిరి ఫాదర్ సెంటిమెంట్ ఫార్ములా తో తెరకెక్కుతోందని అంటున్నారు. అయితే అందులో తండ్రి ఆశయాన్ని, ఆయన హఠాన్మరణం తరువాత కొడుకు నెరవేరిస్తే, ఇందులో తన తండ్రికి గల గొప్ప ఆశయం కోసం ఆయనతో కలిసి శత్రువులకు ఎదురెళ్లి నిలబడే ఒక ధీరుడిగా బన్నీ ఈ సినిమాలో నటిస్తున్నట్లు చెప్తున్నారు. 

ఇక కథనం పరంగా ఒక సరికొత్త పంథాలో త్రివిక్రమ్ ఈ సినిమాను నడిపించనున్నట్లు సమాచారం. సినిమాలో ఎంటర్టైన్మెంట్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీట వేయడం జరిగిందని, రేపు రిలీజ్ తరువాత ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని హిట్ అవడం ఖాయమనేది ఆ వార్త యొక్క సారాంశం. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లుగా అసలు అల వైకుంఠపురములో సినిమా కథ అదేనా, లేక కాదా అనే విషయం మనకు తేటతెల్లం అవ్వాలంటే, ఆ సినిమా రిలీజ్ సమయం వరకు వేచిచూడాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: