లౌక్యం తరువాత మ్యాచో హీరో గోపిచంద్ నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఈ హీరో తిరు డైరెక్షన్ లో 'చాణక్య' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని గోపిచంద్ స్టైలిష్ స్టిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మెహ్రీన్ అలాగే బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ ఇటలీ లోని మిలాన్ లో జరుగనుంది. అందులో భాగంగా అక్కడ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం అధ్వర్యం లో ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దాంతో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇక ఈసినిమా ను దసరా బరిలో నిలిపారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.
కాగా అక్టోబర్ 2న మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న పీరియాడికల్ మూవీ సైరా విడుదలకానుందని తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా ఫై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. మరి ఇలాంటి సమయం లో సైరా కు పోటీ గా చాణక్య ను విడుదల చేస్తూ రిస్క్ చేస్తున్నాడు గోపిచంద్. మరి చాణక్య టీం ఇంత సాహసం చేస్తుందంటే ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్ వుండే ఉంటుంది. చూద్దాం మరి ఈ సినిమాతోనైనా గోపిచంద్ వరుస పరాజయాలకు బ్రేక్ వేసి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో.. ఇక గోపించంద్ కెరీర్ లోనే చాణక్య అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈసినిమాకు ఏకంగా 35 కోట్లు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు అనిల్ సుంకర , అభిషేక్ అగర్వాల్. పడి పడి లేచె మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.